టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `లైగర్`. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరీ జగన్నాథ్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్పాండే, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ పూరీ జాగన్నాథ్.. ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. అదేంటంటే.. `లైగర్` హీరోయిన్గా అనన్య పాండే ఫస్ట్ చాయిస్ కాదట. అనన్య కంటే ముందు పూరీ జాగన్నాథ్ ఓ క్రేజీ హీరోయిన్ను సంప్రదించారట.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. తనకు అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టంతోనే లైగర్ లో మొదట జాన్వీ కపూర్ ని తీసుకోవాలని భావించినట్లు పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. అయితే ఆమెని అప్రోచ్ అవ్వగా.. కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో జాన్వీ నో చెప్పిందట. దాంతో అనన్య పాండేను తీసుకున్నారట. ఏదేమైనా `లైగర్` వంటి పాన్ ఇండియా సినిమాను వదులుకుని అనన్య పెద్ద తప్పే చేసిందని, ఆమె ఈ మూవీ చేసుంటే కెరీర్ మరోలా ఉండేదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.