Liger: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం `లైగర్`. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరీ జగన్నాథ్ కలిసి హై బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని నిర్మించారు.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కూడా మెరవబోతున్నారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే విడుదల దగ్గర పడుతున్నా పూరీ ప్రమోషన్స్ షురూ చేయలేదు. పాన్ ఇండియా చిత్రమంటే కనీసం రెండు, మూడు నెలల ముందు నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి వరుస అప్డేట్లతో హోరెత్తించాలి. కానీ, లైగర్ టీమ్ మాత్రం సైలెంట్గా వ్యవహిరస్తోంది.
పూరీ ఫోకస్ మొత్తం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జనగణమన`పైనే పెట్టి.. `లైగర్`ను వదిలేశాడు. దీంతో `లైగర్`పై పూరీది కాన్ఫిడెన్సా..? లేక ఓవర్ కాన్ఫిడెన్సా..? అన్నది అర్థం కావడం లేదు. కాన్ఫిడెన్స్ అయితే ఏమీ కాదు గానీ.. ఓవర్ అయితేనే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు నెటిజన్లు. మరి ఇప్పటికైనా లైగర్ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తుందో..లేదో..చూడాలి.