`ఉప్పెన` మూవీతో గ్రాండ్గా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన యంగ్ హీరో, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత `కొండపొలం`తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈయన మూడో చిత్రం `రంగ రంగ వైభవంగా`. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో `రొమాంటిక్` బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటించింది.
బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ మూవీ విడుదలను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. మొదట జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ, అది కుదరలేదు. దీంతో సెప్టెంబర్ 2కు ఈ మూవీని షిఫ్ట్ చేస్తూ.. తాజాగా మేకర్స్ ఓ న్యూ పోస్టర్ను బయటకు వదిలారు. అయితే విడుదల విషయంలో మెగా మేనల్లుడి వెనకడుగుకు `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే కారణమని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
అసలేం జరిగిందంటే.. ‘రంగ రంగ వైభవంగా’ మూవీ అవుట్పుట్ను ఇటీవలె గిరీశయ తన గురువు సందీప్ రెడ్డి వంగాకు చూపించారట. అది చూసిన ఆయన కొన్ని మార్పులు, చేర్పులు సూచించారట. ఆయన సలహాల మేరకు గిరీశయ రీషూట్స్ చేస్తున్నాడని.. అందుకే రిలీజ్ డేట్ను మేకర్స్ పోస్ట్ చేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!