సుదీర్ఘ కాలం పాలు సౌత్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వీరికి ఈ ఏడాది ఆరంభంలో పండండి మగబిడ్డ జన్మించాడు. బిడ్డ పుట్టిన ఐదు నెలలకు కాజల్ `ఇండియన్ 2` మూవీతో రీఎంట్రీకి సిద్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు పార్ట్ 2గా `పుష్ప ది రూల్` రాబోతోంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే పుష్ప 1 లో మాదిరిగానే పుష్ప 2 లోనూ ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుందట. పుష్ప 1లో సమంత `ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా` అంటూ ఓ ఊపు ఊపేసింది. అయితే రెండో భాగంగా మరో స్టార్ హీరోయిన్ చేత స్పెషల్ సాంగ్ ను చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇందులో భాగంగానే రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను స్పందించగా.. ఆమె నో చెప్పిందట. దాంతో సుకుమార్ కాజల్ అగర్వాల్ తో చర్చలు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పెళ్లికి ముందు కాజల్ ఐటెం సాంగ్స్ చేసింది. కానీ, ఇప్పుడు ఆమెకు పెళ్లైంది. బిడ్డ కూడా పుట్టాడు. పెళ్లై, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్ నిజంగా స్పెషల్ సాంగ్లో నటించే రిస్క్ చేస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.