సోషల్ మీడియాలో లో వచ్చే ఫేక్ వార్తల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న మనదేశంలో.., సోషల్ మీడియా వాడకం కూడా ఎక్కువగా ఉండటం అంత మంచిది కాదు. సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులకు వల వేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చిక్కుతుంది. తాజాగా జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ. ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయి అంటూ ఓ మోసకారి సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రకటన చేశారు. 120 పోస్టులకు గాను ఎంపికలు జరుగుతున్నాయని 9,800 సహా జిఎస్టి చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఆశపడి కొంత మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఓ వ్యక్తి మాత్రం అనుమానం వచ్చి ఎయిరిండియాను సంప్రదించగా అటువంటి ఉద్యోగ ప్రకటనలు ఏమి ఇవ్వలేదని తేలింది. దీంతో ఇండియా ప్రతినిధులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా ముంబై పోలీసులను కోరారు. ఆ మోసకారి పేర్కొన్న చిరునామా ముంబైలోని అకోలా ప్రాంతంలో ఉంది. కానీ అక్కడ ఎయిర్ ఇండియాకు ఎటువంటి భవనము లేదు. దీంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. సో..! సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ఆర్థికంగానూ, వ్యక్తిగతంగానూ మోసపోక తప్పదు.