ప్రముఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు “జివిఎల్ నరసింహారావు…. బ్రదర్ అనిల్ కుమార్ మేనత్త కొడుకు” ఈ స్టేట్మెంట్ ఒక పెద్ద వార్తలా మారి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. బ్రదర్ అనిల్ కుమార్ ఫోటో పెట్టేసి ఇతను జివిఎల్ ఇతని మేనత్త కొడుకు అంటూ చుట్టరికం కలిపేశారు. ఈ వార్త కాస్తా విపరీతమైన వైరల్ అయిపోయింది. జీవీఎల్ ప్రముఖ బిజెపి పార్టీ నేత…. బ్రదర్ అనిల్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల భర్త. మరి ఇంతటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఇన్నిరోజులు తెలియకుండా ఉండటం ఏమిటి అని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
తీరా చూస్తే వారిద్దరికీ ఎలాంటి చుట్టరికం లేదు అని తేలిపోయింది. కాకపోతే వీరిద్దరి మధ్య సామాజిక వర్గం కలుస్తుంది. అది పట్టుకొని ఏకంగా మేనత్త కొడుకు అంటూ ఒక పోస్టర్ వేశారు. ఇక ఇదంతా టిడిపి వాళ్ళ పని అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. జీవీఎల్ నరసింహారావు మరీ అడ్డగోలుగా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని.. జగన్ ను ప్రతి విషయంలో వస్తున్నాడని ముందు నుండి టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. కాబట్టి బీజేపీ విధానం ఏమిటో పూర్తిగా బయటపడక ముందే జివిఎల్ ఇలా వచ్చి సొంత పెత్తనం చేస్తున్నాడని అతని టార్గెట్ చేస్తూ…. ఇలా బ్రదర్ అనిల్ కుమార్ ఫోటో ని వాడుకొని ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
పేరు కి బీజేపీ నేత కానీ కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా జివిఎల్ ఇలాగే కన్నా… ఏం చెప్పినా చాలా విరుద్ధంగా ప్రకటనలు చేసేవాడు. ప్రత్యేక హోదా సమయంలో… హోదా అనవసరమని ముగిసిపోయిన అధ్యాయమని…. ఇలా రకరకాల నెగెటివ్ కామెంట్స్ చేసేవాడు. ఇవన్నీ చూసి అమరావతికి మద్దతిచ్చే వారో లేక తెలుగుదేశం పార్టీ శ్రేణులో ఈ పోస్టర్ ను క్రియేట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. అయితే జీవీఎల్ కు బ్రదర్ అనిల్ కుమార్ కు ఎలాంటి చుట్టరికం అయితే లేదు అన్నది వాస్తవం.