లాయర్లు…పోలీసులు… బండిపై స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతుంటారు. మరి టీచర్లు పెట్టుకోవచ్చా..? టీచర్లు కూడా తమ వాహనాలపై పెట్టుకుని సమాజంలో తమ స్థాయిని తెలియజేయవచ్చా…? ఇది నిజమే అని… సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. అనేక విధాలుగా ప్రచారం జరిగింది. మరి ఇది నిజమా, కదా అనేది పరిశీలిస్తే అవాస్తవం అని తేలింది. “పిఐబీ” అనే వార్తా సంస్థ ఇవి అవాస్తవం అని తేల్చింది.
అసలు ఈ పుకారు ఎలా వచ్చింది..? ప్రచారం ఎలా మొదలైంది..? అనేది పరిశీలిస్తే 2017 కి మనం ఓ సారి వెళ్ళాలి. అప్పట్లో పంజాబ్ లోని రాజేష్ ఖన్నా అనే ఉపాధ్యాయుడు టీచర్స్ డే సందర్భంగా “టీచర్ – A Nation Builder , I want, I can, I Will” అని ప్రచురించారు. ఇది ఫోటో రూపంలో బయటకు వచ్చి… సాక్షాత్తూ కోర్టు కూడా టీచర్లకు స్టిక్కర్లు కోసం అనుమతి ఇచ్చేసింది అంటూ వార్తలు వ్యాపించాయి. తీరా ఇది అవాస్తవం అని, ఫేక్ న్యూస్ అని పిఐబీ కొట్టేసింది.