కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో అన్లాక్ 4.0 ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1 నుంచి పలు ఆంక్షలను సడలించారు. ఇక త్వరలో మరిన్ని ఆంక్షలను సడలించనున్నారు. అయితే దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ను సెప్టెంబర్ 25 నుంచి అమలు చేస్తారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారమవుతోంది. అయితే ఈ వార్త ఫేక్ అని తేలింది.
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా 46 రోజుల పాటు మళ్లీ లాక్ డౌన్ను విధించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ ప్లానింగ్ కమిషన్ భారత ప్రభుత్వానికి సూచించిందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కువగా ప్రచారమవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ వార్త అబద్ధమని తేలింది. సదరు కమిషన్ ఎలాంటి ఆదేశాలను భారత ప్రభుత్వానికి ఇవ్వలేదని, అందువల్ల ఆ వార్త ఫేక్ అని నిర్దారించారు.
Claim:A Media report has claimed that Home Ministry has ordered reopening of cinema halls across the country from 1st October with the imposition of strict regulations. #PIBFactCheck: This claim is #Fake. No decision has been taken by @HMOIndia on reopening the cinema halls yet pic.twitter.com/hc903cfXnm
— PIB Fact Check (@PIBFactCheck) September 14, 2020
ఇక కేంద్ర హోం శాఖ అక్టోబర్ 1 నుంచి సినిమా హాల్స్ ను ఓపెన్ చేసుకునేందుకు యాజమాన్యాలకు అనుమతులు ఇచ్చిందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. సదరు మంత్రిత్వ శాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పీఐబీ నిర్దారించింది. అందువల్ల ఈ మెసేజ్లను నమ్మకూడదని తెలిపారు.
కాగా దేశంలో ఇప్పటికే అన్లాక్ 4.0 ప్రక్రియ నడుస్తున్నందున ఇకపై లాక్డౌన్లు విధించబోరని స్పష్టమవుతోంది. అందువల్ల దేశంలో మళ్లీ లాక్డౌన్ను విధిస్తారని వచ్చే వార్తలను నమ్మకండి.