ఇటీవల కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో లాక్డౌన్ నేపథ్యంలో రామాయణ్ సీరియల్ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సీరియల్ లో రావణ పాత్ర దారి అరవింద్ త్రివేది లంకేశ్ చనిపోయినట్లు సరికొత్త పుకారు ఇటీవల సోషల్ మీడియాలో ఫోన్ న్యూస్ వైరల్ అవుతోంది.
దీంతో వెంటనే అరవింద్ త్రివేది లంకేశ్ స్పందించారు. నేను ఇంకా చనిపోలేదు బతికే ఉన్నానని స్పష్టం చేయడం జరిగింది. దీంతో చాలామంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా అరవింద్ త్రివేది లంకేశ్ కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. ఆయన మేనల్లుడు కౌస్తుభ్ త్రివేది ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మా అంకుల్ అరవింద్ త్రివేది లంకేశ్ క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆయనపై అసత్య ప్రచారం ఆపండి. ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ తెలియజేయాల’ని కౌస్తుభ్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో త్రివేది లంకేశ్ కూడా ఇదే ట్వీట్ను హిందీలో తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు.