భారతీయ సంప్రదాయంలో పెళ్లి తర్వాత జరిగే ఘట్టం మొదటి రాత్రి. తెల్లని దుప్పటిని మంచం పై వేయడం, పాలను తీసుకెళ్లడం , మల్లె పూలతో మంచాన్ని అలంకరించడం ఇవన్నీ కూడా సాంప్రదాయంలో భాగమే. అసలు మొదటి రాత్రి రోజు తెల్లని దుస్తులను ఎందుకు వేసుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్లని వస్త్రం వేయడం వెనుక రహస్యం ఏమిటంటే.. దీని వల్ల వధువు కన్వత్వాన్ని తెలుసుకోవచ్చట. తొలిరాత్రి కలయిక వల్ల కన్నెపోర తొలగి రక్తం స్రావం జరిగితే అది తెల్లని వస్త్రంపై స్పష్టంగా కనపడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు ఆ వస్త్రంపై రక్తపు మరకలు గుర్తిస్తే వధువు కన్య అనేది పూర్వీకులు నమ్మకం. దీన్ని కూడా సంబరంగా జరుపుకునేవారు. మన అందరికి తెలిసినవిధంగా, కన్నెపొరకు కన్యత్వాని కి ఏ విధమైన సంబంధం లేదు. కన్నె పోర తొలగిపోవడం వలన కన్నెత్వం పోయినట్టు కాదు. ఎందుకంటే కేవలం సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే కాదు, అసలు కొందరికి పుట్టుకతోనే ఉండక పోవచ్చు లేదా ఏదైనా ఆటలు ఆడినప్పుడు, సైకిల్ తొక్కుతూ ఉన్నపుడు, దూకుడు ఆటలు ఆడే టప్పుడు కూడా కన్నెపొర తొలగి పోతుంది. ఎందుకంటే కన్నె పోర అనేది చాల పలుచగా ఉంటుంది. అలా ముందుగానే కన్నెపోరా తొలగి పోవడంవలన కలయిక తర్వాత రక్తం రాకపోవచ్చు. ఈ కారణం గా కొంతమంది అమ్మాయిలు కన్యలుగా ఉన్నప్పటికీ రక్తస్రావం మాత్రం జరగదు. కాబట్టి అలాంటి అమ్మాయిలను అనుమానించి అవమానించడం దూషించడం సరి అయిన పద్దతి కాదన్నా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి .రోజులు మారాయి పద్ధతులు మారాయి. ఇదండీ మొదటి రాత్రి తెల్లని దుస్తులను వేసుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం.