మనిషికి జీవితంలో అతి ముఖ్యమైన రోజులు రెండే రెండు ఉన్నాయి. ఒకటి జన్మించిన రోజు, ఇంకొకటి చనిపోయిన రోజు అందుకే మనం పరిశీలిస్తే ఎక్కడైనా ఆ రెండు రోజులు మాత్రమే రాస్తారు.. కానీ జీవితం లో గొప్పగా సాధించిన ఈ రోజులు కూడా రాయరు. అంటే జననం ఇంకా మరణం మాత్రమే నిజమైన రోజులు. పుట్టిన తర్వాత జరిగే బారసాల, అన్నప్రాసన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి కి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.
పుట్టిన తర్వాత జరిగే ఈ కార్యక్రమాలకు ఒక కారణం ఉంటుంది. చని పోయిన తర్వాత చేసే అంతక్రియలు లో పాటించే కొన్ని పద్ధతుల వెనుక కూడా కారణం ఉంటుంది. అందులో ఒకటి కుండ పగలగొట్టడం. అది కూడా కుండ కు రెండు రంధ్రాలు పెట్టిన తర్వాత కిందకు వదిలేసి పగలగొడతారు. అలా చేయడం వెనకాల ఉన్న కారణం తెలుసుకుందాం. ఒక మనిషి చనిపోయిన తరువాత తన శరీరం లో నుండి అదే మనిషి రూపం బయటికి వచ్చి పడిఉన్న తన శరీరాన్ని లేపడం, బంధువులతో స్నేహితులతో తను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పడం సినిమాల్లో చూసే ఉంటారు. దాన్నే ఆత్మ అంటారు.
ఇక్కడ నమ్మవలిసింది ఏమిటంటే నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. మనిషి చనిపోగానే శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా ఆత్మ, తన శరీరం లోకి వెళ్లి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు స్మశానం ఇంకా కొద్ది దూరంలో ఉందనగా పాడే ని దింపి, చిన్న మూటలో లో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు.
ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన పేలాలు , ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్క పెట్టిన తర్వాతనే, ఆత్మకి తన వాళ్ల దగ్గరకి చేరుకోవడానికి అనుమతి దొరుకుతుంది. ఆ పని సూర్యోదయం లోపు గా పూర్తి చేయవలిసి ఉంటుంది .. అప్పటి లోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కపెట్టవలిసి ఉంటుంది.
శరీరాన్ని చితి మీద పెట్టిన తర్వాత కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. దానికి కారణం, కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలా గైతే బయటకు వెళ్లి పోయిందో, నీ శరీరం నుండి నీ ఆత్మ కూడా అలాగే బయటికి వెళ్ళిపోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే నీరు నిల్వఉంచని కుండా ఎలా పనికి రాదో ఆత్మా వెళ్లిపోయిన శరీరం కూడా అంతే .. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇక నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు ఇంకా పై లోకాలకు వెల్లిపో.. అని ఆత్మకు మనం తెలియచేసే సంకేతం.
హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పని వెనుక ఓక అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ. దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసి తెలియని వారికీ కూడా తెలియచేయండి.