ఒక శిశువు పుట్టినప్పుడు తనని ప్రపంచంలోకి స్వాగతిస్తూ బారసాల, అన్నప్రాసన ఎచేస్తాము .. అలాగే మరణించినప్పుడు ఆ మనిషికి చివరిసారిగా వీడ్కోలు పలుకుతూ, వేరే లోకాలకి చేరాలి అని మనః శాంతి కలగాలని ప్రార్థిస్తూ దహన సంస్కారాలు పూర్తి చేస్తాము.
మన హిందూ సంప్రదాయంలో అయితే అంత్యక్రియలు జరిగేటప్పుడు అప్పుడు స్మశాన వాటిక కి స్త్రీ లు రారు. దీనికి నాలుగు కారణాలు ఉన్నాయి అని అంటారు.
అందులో మొదటి కారణం ఏంటంటే పూర్వం అంత్యక్రియల సమయం అప్పుడు ఇంట్లో భోజన ఏర్పాట్లు చేస్తూ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు ,పిల్లలను చూసుకోవడానికి కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు మగవాళ్ళు మాత్రం స్మశానం లో పని పూర్తి చేసుకు వచ్చేవాళ్ళు.
రెండవ కారణం ఆడవాళ్ళు భావోద్వేగాలను మగవాళ్ళ కంటే కొంచెం ఎక్కువగా చూపుతారు. వారు స్మశానానికి వెళితే చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు అవుతున్నప్పుడు చూసి తట్టుకోలేక మానసికంగా బాగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్ లో కి వెళ్లి పోతారు.ఈ రెండు కారణాలు ప్రాక్టికల్ గా ఉంటే మిగిలి నరెండు కారణాలు శాస్త్రానికి సంబంధించినవి.
అందులో మొదటిది, స్మశానంలో దుష్ట శక్తులు, దెయ్యాలు ఉండి అవి మహిళల్లో కి ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీ ల్లో కి సులభంగా ప్రేవేశించే అవకాశాలు ఎక్కువట. అంతేకాకుండా గర్భవతిగా ఉన్న మహిళలు స్మశానం లోకి వస్తే దుష్ట శక్తుల ప్రభావం వారిపై పడే అవకాశం ఉంటుందంట. అందుకే గర్భవతులు అంత్యక్రియల కార్యక్రమానికి మాత్రమే కాదు, పార్థివ శరీరం వద్దకు కూడా వెళ్లరు.
ఇంకొక కారణం ఏంటి అంటే దుష్ట శక్తులు ఒక మనిషి లోకి ప్రవేశించడానికి ముఖ్యమైన మాధ్యమం జుట్టు అట. కాబట్టి అంత్యక్రియలు చేసిన తర్వాత ఆ మనిషి లో కి స్మశానం లో ఉండే ఇతర ఏ చెడు శక్తులు ప్రవేశించ కుండా ఆ మనిషి యొక్క జుట్టుని తీసేస్తారట. ఒకవేళ ఆడవాళ్ల కు తమ జుట్టును తీసేయడం లో ఎటువంటి అభ్యంతరం లేకపోతే దహన సంస్కారాలు కి వెళ్లొచ్చట. పైన చెప్పిన కారణాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు.