ఇప్పటి వరకు ఏపీలో న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి ప్రత్యక్ష యుద్ధం చూస్తున్నాం..! ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. హైకోర్టు తీర్పుల్లో ఏకంగా సుప్రీమ్ జడ్జి ఒకరు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. రెండు వరాల కిందట పార్లమెంటు వేదికగా ఎంపీలు ఏపీలో హైకోర్టు తీర్పులపై ఆందోళన చేయడం.., ఇటీవల సీఎం జగన్ ప్రధాని మోడీని కలవడం.., తాజాగా హైకోర్టు కూడా ప్రభుత్వ పెద్దలు, వైసిపి నాయకుల వ్యాఖ్యలపై తీర్వ వ్యాఖ్యలు చేయడం ఇప్పటి వరకు సంచలన అంశాలుగా ఉండగా… తాజాగా రేపిన వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో..?
సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. హైకోర్టులో వస్తున్న తీర్పులను సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు చేసింది. అమరావతి భూ కుంభకోణాలపై సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వడాన్ని, మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో గాగ్ ఆర్డర్ ఇవ్వడంలో రమణ పాత్ర ఉంది అంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్ళం రెడ్డి శనివారం రాత్రి విలేఖరుల సమావేశం నిర్వహించి ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ కేసుల్లో ఎన్వీ రమణ పాత్ర, హైకోర్టులో తీర్పులు, కేసుల తీర్పులు అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ సీఎం జగన్ సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రసారాని అజయ్ కళ్ళం తెలిపారు. అంతే కాకుండా ఎన్వీ రమణ ఆస్తుల లావాదేవీలు, దమ్మాలపాటి కేసులో ఆయన కుమార్తెల పేరిట భూములు, 2013 కి 2016 కి మధ్య రమణ ఆస్తుల వివరాలు, ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పులు… వంటి ప్రాధమిక సమాచారం, కొన్ని కీలక దస్త్రాలతో సీఎం జగన్ ఈ నెల ఆరున సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారని.. ఆ వివరాలను అజయ్ వెల్లడించారు.