టైమ్కు కులానికి సంబంధమేంటి?
దేశంలో మతాలున్నాయి. మత ప్రాతిపదికన దేశం రెండు ముక్కలయ్యింది. తర్వాత కులాల ప్రస్తావనతో అగ్రవర్ణాలు, బహుజనులు, దళితులు అంటూ వర్ణాలు ఏర్పడ్డాయ్. తర్వాత అగ్రవర్ణాల్లో పలానా కులం… పలానా కులం అంటూ చెప్పుకోవడం మొదలయ్యింది. ఇక అట్టుడుగు వర్గాలు కులం పేరుతో ఛిన్నాభిన్నమైపోయాయ్… ఇక తెలుగు నేలపై కుల ప్రభావం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వెనకటికి ఒకాయన బెజవాడ బెంజ్ సర్కిల్లో… టైమెంతండీ అని అడిగితే మీరేమిట్లండీ అన్నారట… ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైన సీన్. అంతేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ సర్కారు తట్టాబుట్టా సద్దాక… బెజవాడ, గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో కుల ప్రాతిపదికన ఇళ్లను రెంట్కు ఇచ్చిన వార్తలు మీడియాలో కొకొల్లలు… ఈ సోదంతా ఏంటని అనుకుంటున్నారా…
అమరావతిలో ఎస్సీలు, బీసీలు, ముస్లింలూ ఉన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడూ మాట్లాడని కుల గురించి ఇప్పుడు మాబాగా మాట్లాడేస్తున్నారు… హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశా… అప్పుడు లేని కులం అమరావతిలోనే వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంలో ఒకే కుంలం వారు నాకు ఓట్లేస్తున్నారా… జగన్ వచ్చిన నాటి నుంచే కులం అంటగడుతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు…. నిజంగా ఎంతో అయోమయాన్ని కలిగిస్తున్నాయ్… అంతే కాదు… అమరావతి గురించి ఎన్నో దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని… అనవసరంగా ప్రజల మనసులను కలుషితం చేస్తున్నారని ఆయన అంటున్నారు. అంతే కాకుండా… అమరావతిలో ఒకే కులం ఉందా… చుట్టుపక్కలన్నీ ఎస్సీ నియోజకవర్గాలే… బీసీలు, ముస్లింలు కూడా ఎక్కువే ఉన్నారు. వైసీపీ నేతలు కొందరు నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారని… కావాలనే ప్రయోజనాలను అంటగడుతున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో సెంటు భూమి కొనలేదని… రైతులకు అన్నీ సమకూర్చాక స్థలం తీసుకొని… ఇల్లు కడదామనుకున్నా… కట్టలేక పోయా… అయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు…
బయటకు ఒకరు కన్పిస్తారు.. మరొకరు కన్పించరు…
రెండు పార్టీల గురించి రెండు క్లిష్టర్ క్లియర్ భేదాభిప్రాయాలున్నాయ్. ఒకరు గుట్టుగా సైలెంట్ గా చాప కింద నీరులా పనికానించేస్తారు. కానీ మరొకరు… పబ్లిగ్గా చేసేస్తారు. తడిగుడ్డతో ఒకరు గొంతు కొస్తే మరొకరు పబ్లిక్ గా కొస్తారంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయ్. ఇలాంటి సందర్భంలో అమరావతి గురించి అందరూ ఒకటే చెబుతున్నారు. రాజధాని భూములు, డబ్బు రెండూ అంశాలనే చూస్తున్నారని గానీ… మిగతా ఏమీ కూడా పట్టించుకోవడం లేదన్నది ఆ ఆరోపణ. వాస్తవానికి చంద్రబాబు ఉన్న భ్రమరావతి కాన్సెప్ట్ కేవలం… అలాంటి ఆలోచనలతోనే ముందుకు సాగలేదు. రాజధాని విషయంలో చేసిన జాప్యం… నిబంధనల రూపాకల్పన… క్విడ్ ప్రొకో లాంటి ఎన్నో విమర్శలు అమరావతికి శాపంగా మారాయ్… జరిగేది జరగకమానదు… జరగనిది ఎన్నటికీ జరగదు… ఈ చిన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గ్రహించడం లేదు.
ఏపీలో కులం ఇప్పుడు మూడుముక్కలాట
ఏపీలో కులం ఇప్పుడో విషపదార్థం. కమ్మలు టీడీపీకి అండగా ఉంటుంటే… రెడ్డి సామాజికవర్గం జగన్ కు బాసటగా నిలిచింది. కానీ గత ఎన్నికల్లో జనసేన చీఫ్ సరైన పంథా లేకుండా ఎన్నికలకు వెళ్లకపోవడం వల్ల రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గం ఎటువైపు మొగ్గాలో తెలియక అయోమయానికి గురయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో… ఇప్పుడు ఆ సామాజికవర్గాన్ని చేరదీసే పనిని కమలం పార్టీ తీసుకుంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీ బీజేపీ చీఫ్గా ఎన్నికలకు ముందు కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పటికీ… ఆయనపై ఆ ముద్రపడలేదు. కానీ ఇప్పుడు బీజేపీ చీఫ్గా వచ్చిన సోము వీర్రాజు కాపు సామాజకవర్గాన్ని ఒకే గొడుకు కిందకు తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కన్పిస్తోంది. అదే జరిగితే… ఏపీలో మూడు ముక్కలాట ఖాయం..
బెజవాడలో చంద్రబాబుకు కుల జబ్బు అంటుంకుందా…?
చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో ఉన్నంత కాలం ఎప్పుడూ కులం గురించి ఆలోచించలేదని… ఆయన ఎప్పుడైతే… మకాం బెజవాడకు మార్చారో అప్పట్నుంచో మారిపోయారంటారు ఆయనకు అత్యంత సన్నిహితులు. బెజవాడలో కొందరు తమ స్వార్థం కోసం రేపిన కుల చిచ్చు గురించి పవన్ కల్యాణ్ ఐదేళ్లలో మాట్లాడిన మాటలు వింటే మళ్లీ మనకు స్మరణకు వస్తాయ్. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరు ఖండించగలరు… అవును మీరు చిన్న డివియేషన్ ఎదుర్కొంటే… అవతల వాళ్లు ఇంకా పెద్ద గ్యాప్ క్రియేట్ చేయగలరు కదా… బీసీల పార్టీ అంటూ మీరు చేసిన ప్రచారం కూడా భస్మీపటలం అయ్యింది. బీసీలు ఇప్పుడు వైసీపీకి దన్నుగా ఉన్నారన్న అభిప్రాయం కూడా బాగా విన్పిస్తోంది. ఇలాంటి సందర్భంలో తన సామాజికవర్గంపై ఉన్న విముఖతను తగ్గించి… సమాజాన్ని అంతటినీ ప్రభావితం చేసేలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే బాధ్యతను చంద్రబాబు తీసుకోవాలి. లేదంటే అది కేవలం టీడీపీకి మాత్రమే కాదు… ఇంకో రోజు ఎవరికైనా వర్తిస్తుంది.