ఇప్పుడు జగన్ అంటే తెలిసీ, తెలియక “మాంసం తినేసాక ఎముకలు మెడలో వేసుకుని తిరిగే రకం” కానీ.. అప్పట్లో చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా చాలా తిండి యవ్వారాలు సాగేవి..!! అర్ధం కాలేదేమో.., కొంచెం లోతుకి వెళదాం..!! జగన్ సీఎం అయ్యాక విడుదల చేసిన చాలా జీవోలు, తీసుకున్న చాలా నిర్ణయాలు బయటకు వస్తున్నాయి. వివాదాస్పదమవుతున్నాయి. కానీ అప్పట్లో బాబోరు అనేక నిర్ణయాలు, అనేక జీవోలు వివాదాస్పదమైనవే తీసుకున్నారు. సీకటి యవ్వారాలన్నీ ఆ జీవోల ద్వారానే నడిచేవి. కానీ తన కన్నింగ్ నెస్ తో వాటిని బయటకు రాకుండా, కోర్టుల వరకు వెళ్లకుండా ఆపగలిగారు. అప్పట్లో బాబోరు తీసుకొచ్చిన ఓ జీవో తాజాగా బాబుకి ఎసరు పెట్టింది. హైకోర్టు వరకు వెళ్లి, మొట్టికాయలు వేసే వరకు చేరింది.
భద్రత కమీషన్ లో జగన్ వద్దు అంటూ..!!
ప్రతీ రాష్ట్రానికి భద్రత కమీషన్ ఉండాలంటూ 2006 లోనే సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా 2009 లో ఏపీలో ఏర్పాటు చేశారు. మళ్లీ 2013 లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో మార్పులు చేసి, ఆరుగురు సభ్యులను చేర్చారు. ముఖ్య కార్యదర్శి, హోమ్ శాఖ కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, హైకోర్టు విశ్రాంత జడ్జి, ప్రతిపక్ష నేత తదితరులు దీనిలో సభ్యులుగా ఉండాలని పేర్కొంటూ జీవో ఇచ్చారు. అయితే 2015 లో చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో దీనిలో మార్పులు చేశారు. రాష్ట్ర భద్రతా కమీషన్ లో ప్రతిపక్ష నేత ఉండకూడదు అంటూ బాబు ప్రభుత్వ హయాంలో జీవో వచ్చింది. నాడు చంద్రబాబు తన రాజకీయ అవసరాలు, ఆలోచనల రీత్యా ఆ జీవోని తీసుకువచ్చారు.
ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే..!?
తాజాగా.. ఏపీ భద్రతా కమీషన్ లో ప్రతిపక్ష నేతకి స్థానం ఉండాలి అంటూ ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. దీనిపై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సెక్యూరిటీ కమీషన్ లో ప్రతిపక్ష నేతకు స్థాన ఉండాల్సిందే అనీ.., సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేసింది. ఆ జీవోను వెంటనే సవరించి, ప్రతిపక్ష నేతకి స్థానం కల్పించాలని ఆదేశించింది. మొత్తానికి నాడు చంద్రబాబు తీసుకొచ్చిన జీవో.., నేడు అతనికే స్థానం లేకుండా చేస్తే.., చివరికి కోర్టు ద్వారా స్థానం దక్కించుకోవాల్సి వచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?