Cocktail Drug: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త కొత్త మందులు కూడా అలాగే వస్తున్నాయి.. ఓ వైపు కరోనా సోకినా ఏమీ కాకుండా ఉండేందుకు వాక్సిన్లు ఇస్తున్నారు. మరోవైపు కరోనా సోకి, సీరియస్ అయి ఆసుపత్రికి చేరితే బతికించడానికి రకరకాల మందులు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి కొత్త మందు వస్తుంది. “ట్రంప్ కాక్ టెయిల్” అని పిలుస్తున్న ఈ కొత్త మెడిసిన్ ని ఇండియాలో తొలిసారిగా ఈరోజు 84 ఏళ్ళ హర్యానావాసి మొహబ్బత్ సింగ్ కి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రెండు యాంటీబాడీ మెడిసిన్ మిశ్రమాన్ని కలిపి రోచెస్ సంస్థ దీన్ని రూపొందించారు. తొలిసారిగా గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి దీన్ని అందించారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నా అయన అప్పట్లో ఈ గృగ్ ఒక డోస్ తీసుకుని నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితిలోకి వచ్చేసారు. అప్పటి నుండి దశల వారీగా పరీక్షలు పూర్తి చేసుకుని.. తాజగా ఇండియాలోకి అడుగు పెట్టింది.
Must read : యాంటీ బాండ్స్ మన శరీరంలో ఎన్ని నెలలు ఉంటాయో చూడండి..!
Cocktail Drug: ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా.!?
ఇండియాలో ఇప్పటి వరకు కరోనా ట్రీట్మెంట్ కి రెమెడీస్వెర్ వాడారు. ఒక్కో పేషేంట్ కి అయిదు డోసులు ఇచ్చేవారు. అప్పటికీ తగ్గకపోతే టోసిలిజోమాబ్ రెండు డోసులు ఇచ్చేవారు. ఇదే ఫైనల్ అనుకునేవారు. ఇది చాల వరకు పని చేసినప్పటికీ… వీటి వలన ఆ పేషేంట్ లో వేరే శారీరక సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. తాజాగా రెమెడీస్వెర్ వాడొద్దు అంటూ ICMR ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పడూ వస్తున్నా కొత్త కాక్ టెయిల్ డ్రగ్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది రెండు “కెసిరివిమాబ్ & ఇండివిమాబ్ (Casirivimab and Imdevimab) అనే రెండు యాండీ బాడీల కలయికతో రూపొందించారు. దేశంలోకి సిప్లా ద్వారా వస్తుంది. ఈరోజు గురుగ్రం లోని మోహ్హబ్బత్ సింగ్ కి పరీక్షించడం.. ఓ గంట పాటూ అతన్ని పరిశీలించగా.. బాగా పని చేస్తున్నట్టు గుర్తించారు. అందుకే ఇకపై ఈ డ్రగ్ వాడేందుకు కేంద్రం కూడా సమ్మతించింది. దీని విలువ రూ. 59,000 ఉండగా… ఒక పేషేంట్ కి ఒక డోసు సరిపోతుంది అని వైద్యులు పేర్కొంటున్నారు. “65 ఏళ్ళు దాటినా వాడొచ్చు.. కానీ గుండె జబ్బులు ఉన్నవారికి, మధుమేహం ఉన్నా వాడకపోవడం మంచిది అంటూ గురుగ్రం వైద్యుడు షశీలా కటారియా తెలిపారు.