మనం ఆరోగ్యంగా కనిపించిన కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ తీయాలని డాక్టర్లు చెబుతుంటారు. దానికి కారణం ఏంటో మీకు తెలుసా..? క్యాన్సర్ అనగానే భయపడిపోవాల్సిన అవసరమేమీ లేదు. కానీ దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా నయం చేయగలరు. అలా క్యాన్సర్ ను గుర్తించడానికి ముందస్తుగా కనిపించే లక్షణాలు బయటపడాలి. ఆ లక్షణాలు కనిపించడం చాలా అరుదు. అందుకే క్యాన్సర్ ను గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు చాలా ఉపయోగపడుతాయి. అలా లక్షణాలు బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తే.క్యాన్సర్ ఉందని తేలితే వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం చాలా సులభం.అలాగే సకాలంలో చికిత్స చేయడానికి సాధ్యమవుతుంది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా అవసరం.చాలా మందిలో ఈ వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడవు. వారికి క్యాన్సర్ ఉన్నా కానీ తెలియదు. అందుకే అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం అవసరం. క్యాన్సర్ ముందస్తు లక్షణాలు ఇలా ఉంటాయి.. గడ్డలు, అసాధారణ రక్తస్రావం, చాలాకాలం అన్నం సరిగ్గా జీర్ణం కాదు. ఈ లక్షణాలు ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం, నోరు, పెద్దపేగు, చర్మ క్యాన్సర్లలో కనిపిస్తాయి.
క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తిలో ఉన్న క్యాన్సర్ ను గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ సులువైన పరీక్ష ద్వారా ఎంతో మందిలో ఉన్న క్యాన్సర్ ను గుర్తించారు. దాంతో త్వరగా వైద్యాన్ని స్టార్ట్ చేసి నయం చేయగలిగారు. ఈ పరీక్ష వలన మనకు లభమే కానీ నష్టం ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా పొగతాగే వారు, గుట్కా, పాన్మసాలా, జర్దా మొదలైనవి నమిలే అలవాటున్నవారు, మద్యానికి బానిసలైనవారికి ఉంటుంది. అలాగే సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులున్నవారు, ఊబకాయం ఉన్నవాళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.