రూ. 50 వేలు ఇస్తున్న జీతం అమాంతంగా రూ. 25 వేలుకి తగ్గించారు..! “సరేలే ఖర్చులు తగ్గించుకుందాం, కంప్రమైజ్ అయి చేసుకుందాం” అనుకుంటే..! ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళానికి, శ్రీకాకుళం నుండి కరీంనగర్ కి బదిలీ చేస్తారు..! సరేలే తప్పదు “ఏదో ఒకటి చేసుకుందాం.., ఎక్కడైనా అదే అద్దె ఇల్లు, అవే ఖర్చులు కదా” అనుకుని చేసుకోవాలని ఫిక్సయితే..! “పెర్ఫార్మన్స్ బాలేదు. వారానికి నాలుగు మెయిన్ పత్రికకి ఇవ్వాలి. మీరు పనితీరు రోజు మెయిల్ పంపించాలి. నెలకోసారి మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. మిస్ అయితే ఊరుకోము” అంటూ పై నుండి ఎక్కేస్తుంటే..!! “ఛీ, ఛీ నాదీ ఉద్యోగమేనా.., ఇక మానెయ్యాలి, ఏదోటి చూసుకోవాలి” అని ఉద్యోగి అనుకోవాలి. అదీ ఆ సంస్థ లక్ష్యం..! నెరవేర్చుకునే దిశగా ప్రణాళికలు అమలు చేస్తుంది..!!
కరోనా కష్టాలు పేరిట వెరైటీ శిక్షలు..!!
కరోనా వచ్చింది. కష్టాలు తెచ్చింది. నష్టాలు ఇచ్చింది. ప్రపంచమంతా ఒక ఆరు నెలలు ఆగిపోయింది. “ఈనాడు” కూడా అదే కోవలోకి వెళ్ళింది. కానీ ఈనాడు అప్పటి నుండో కాసుక్కూర్చుని.., ఎదురు చూస్తున్న ఉద్యోగుల కత్తిరింపు ప్రక్రియకు సానపెట్టింది. లీగల్ గా ఇరుక్కోకుండా ఉద్యోగులను పీకేయాలి అంటే కరోనానే కరెక్టు సాకు అనుకుని, ఒక ప్లాన్ ప్రకారం ఉద్యోగులకు శిక్షలు వేయడం మొదలు పెట్టింది.
* లీగల్ గా ఇబ్బంది రాదు అనుకునే ఉద్యోగులను పీకేశారు. అంటే సంస్థలో చిన్నస్థాయిలో గ్రామ/ మండలాల్లో యాడ్లు, సర్క్యులేషన్, మెషిన్ సెక్షన్ వాళ్ళను మొదటి దశలో తీసేసింది. ఇలా సుమారుగా 1200 మంది కడుపు కొట్టింది. పాపం, కరోనా సమయంలో వేరే ఉద్యోగాలు లేక, ఎక్కడకూ తిరగలేక ఆ కుటుంబాలు వీధికెక్కాయి.
తాజాగా ఏం చేశారంటే..!!
చిన్నస్థాయి వాళ్ళను అలా చేసాక..! ఇక లీగల్ గా ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్లకి లే ఆఫ్ ప్రకటించారు. పని కట్టు, వేతనం కట్టు..! “సెలవులు లేవు, ఎల్టీటీలు, ఇతర సదుపాయాలూ లేవు.
సగమే పని, పనికి తగిన వేతనం.. ఉంటె ఉండు, లేకపోతే పోవొచ్చు. అసలే కష్టాల్లో ఉన్నాం” అంటూ జూన్ నుండి శిక్షల అమలు మొదలయింది.
* డెస్క్ లో పది మంది ఉంటె రెండు బృందాలుగా విడగొట్టి.. ఒక బృందానికి 15 రోజులు, మరో బృందానికి 15 రోజులు పని కల్పించారు. అలా సగం జీతం, సగం వేతనంతో నెట్టుకొచ్చారు. దీనిలో తమ అనుకునే వారికి మినహాయింపు ఇచ్చరులెండి.., అది వేరే విషయం..!!
* ఫోటో గ్రాఫర్లకు పాపం రెండేళ్ల నుండి పరిస్థితులు బాలేవు. ఏ క్షణాన ఎవర్ని పీకేస్తారో తెలియదు. కానీ లీగల్ గా తీసెయ్యడానికి లేదు. కానీ ఏదోటి చేసి గత ఏడాదిలో ఏడుగురిని సెటిల్ చేసి పంపించేశారు. ఇక తాజాగా ఈ నెల మొదటి వారంలో తొమ్మిది మంది ఫోటో గ్రాఫర్లను బలి(బదిలీ) చేశారు. “పొమ్మనలేక పొగ పెట్టారు”. జీతాలు కోత విధించారు. బదిలీల్లో కూడా సుదూర ప్రాంతాలకు వేశారు. ఉదాహరణకు ; చిత్తూరు నుంచి సూర్యాపేటకు.., సూర్యాపేట నుంచి తిరుపతికి.., తిరుపతి నుంచి ఆదిలాబాద్.., ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం.., శ్రీకాకుళం నుంచి కరీంనగర్.., విజయవాడ నుంచి కడపకు వేశారు. జీతం కత్తిరించి, దూరం పెంచడం ద్వారా వారికి వారే విసుక్కుని, మానెయ్యాలి అనుకునేలా కొత్త తరహా విధానాన్ని అమలు చేశారు. అంతే మరి ఎంతైనా అది “రామోజీ బుర్ర”..! ఆ ఆలోచనలు, ఆ శిక్షలు, ఆ విధానాలు ఎవరికీ సాధ్యం కావు..!!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!