అసలే పేద రాష్ట్రం. నిండా అప్పుల పాలయ్యాము. ఆపై కరోనా కాటు వేసింది. అన్ని పద్దులపై పోటు పడింది. అందుకే ఇక మంత్రాంగం తప్పడం లేదు. ఈరోజు ఇద్దరు ఆర్ధిక మంత్రుల మధ్య పద్దుల పొద్దు పొడిచింది. ఈ క్రమంలోనే పెద్ద చిట్టా పట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన కలవనున్నారు. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో కొత్త నిధుల ఆశలు మొలకెత్తానున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. మొన్న రూ. 491 కోట్లు ఇచ్చినప్పటికీ దేనికీ సరిపోలేదు. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రానికి రూ. 10 వేల కోట్లు వరకు అవసరం ఉందని బుగ్గన నివేదించనున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తో పాటూ ఇతర కీలక అధికారులను, నీతి ఆయోగ్ సభ్యులను బుగ్గన కలవనున్నారని సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?