జగన్ కి ఇప్పుడున్న ఏకైక బలహానత ఏంటి..? హైకోర్టు
జగన్ కి ఇప్పుడున్న ఏకైక తలనొప్పి ఏంటి..? శాసనమండలి
జగన్ కి ఇప్పుడున్న కీలక లక్ష్యం ఏంటి..? మూడు రాజధానులు
ఇక్కడ మూడు రాజధానులు, శాసనమండలి, హైకోర్టుకు లింకులేమిటో తెలిసే ఉంటుంది కదా. ఇది వరకే బిల్లులను ఆమోదించడం.., మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడం.., హైకోర్టు కూడా జగన్ కి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగాయి. అందుకే జగన్ కి బాగా మండి అసలు మండలి నాకు అవసరం లేదు అంటూ… మండలి రద్దు బిల్లుని శాసనసభలో ఆమోదించి, పార్లమెంటుకు పంపించారు. ఇది జరిగిన అయిదు నెలల తర్వాత జగన్ కి ఓ విషయం బోధ పడింది. అదేమిటంటే…!
మండలిలో బలం కోసం పావులు…!!
మండలి రద్దు అంటే కేంద్రం చేతిలో అంశం. వాళ్ళకి పిలక ఇస్తే రెండు, మూడు పేచీలు పెట్టి చివరికి ఆమోదిస్తారో, లేదో తెలియదు. అందుకే జగన్ కి ఈ విషయం ఆలస్యంగా బోధపడింది. అందుకే “మండలిని రద్దు చేయడం ఎందుకు..? బలం పెంచుకుంటే బాగుంటుంది కదా..!” అని జగన్ ఆలోచించారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలిలో ప్రస్తుతం ఉన్న బలానికి అదనంగా మరో 20 మంది అవసరం ఉంది. ఇప్పుడు పది మంది ఉండగా.., మరో 20 మంది ఉంటే ఇక జగన్ కి తిరుగులేనట్టే. సభతో పాటూ మండలిలోనూ దుమ్ము లేపేయొచ్చు.
జూన్ నాటికి జగన్ సాధించినట్టే…!!
జగన్ అనుకున్నట్టు శాసనమండలిలో వైసీపీకి బలం కావాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. మరో ఆరు నెలల్లో 12 మంది ఎమ్మెల్సీలకు గడువు తీరిపోతుంది. అప్పుడు గవర్నర్, ఎమ్మెల్యేల కోటాలో తిరిగి వీటిని పూరించాల్సి ఉంది. ఇవన్నీ వైసీపీకి దక్కనున్నాయి. అక్కడికి మరో ఆరు నెలల్లో మరో 14 సీట్లు ఖాళీ అవుతాయి. అంటే వచ్చే జూన్ నాటికి కూడా ఈ 14 లో వైసీపీకి 10 దక్కనున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే జనవరి/ ఫిబ్రవరి నాటికి 12.., జూన్ నాటికి మరో 10 కలుపుకుని వైసీపీకి 22 సభ్యులు రావడం ఖాయం. ఇప్పుడున్న బలం 10, ఆ 22 కలిపితే 32 కి చేరుతుంది. ఇక మండలిలో వైసీపీకి తిరుగుండదు. టిడిపికి ఆటలు సాగవు. ఇదయ్యా సంగతి. జగనూ.., మరి జూన్ వరకు ఆగుతావా…? లేదా మండలి రద్దు, రద్దు అంటావా…??