Modi : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోడీ.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ స్టూడెంట్ ని సర్ ప్రైజ్ చేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే మోడీకి పంజాబ్ రాష్ట్రంలో అమృత్ సర్ కు చెందిన బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి ప్రణవ్ మహాజన్ మోడీ కి లెటర్ రాయడం జరిగింది. పరీక్షల నేపథ్యంలో ఏవిధంగా ఒత్తిడిని అధిగమించాలి అదేవిధంగా మార్కులు సాధించాలి అన్న దాని విషయంలో మోడీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పుస్తకాన్ని చదివి తాను ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు మోడీ కి విద్యార్థి ప్రణవ్ లెటర్ రాయడం జరిగింది.
Modi : మోడీ సూచించినట్లు యోగా
అంతేకాకుండా మోడీ సూచించినట్లు యోగా అదేవిధంగా వ్యాయామం చేస్తున్నానని శరీరానికి అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి లెటర్ ద్వారా మోడీకి తెలియజేశాడు. దీంతో ఊహించని విధంగా ప్రణవ్ రాసిన లెటర్ కి మోడీ రిప్లై ఇస్తూ స్వయంగా లెటర్ రాయడం స్టూడెంట్ ప్రణవ్ మహాజన్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. మోడీ రాసిన లెటర్ ఈ విధంగా ఉంది..‘‘నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కఠోర శ్రమ అంకితభావంతో నీ పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. నిన్ను నీవు మెరుగుపర్చుకోవాలి. అదే నిన్ను జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది’’ అని ప్రణవ్ మహాజన్ కి మోడీ తెలియజేశారు. ఏదో స్వయంగా మోడీ నుండి తనకి లెటర్ రావడంతో ప్రణవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.