జగన్ సర్కార్ వర్సెస్ ఆ మీడియా
ఏపీలో ఇప్పుడో యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం వర్సెస్ ఆ మీడియా… ఆ మీడియా గతంలో అంతగా పబ్లిక్గా వార్తలను వడ్డించేది కాదు. నాడు వైఎస్ పాలనలోనైనా, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనైనా, ఆ తర్వాత కేసీఆర్ వ్యవహారంలోనైనా… తొలుత కొంత ఊపు చూపించినా… ఆ తర్వాత యజ్ఞంతో అంతా చల్లబడ్డాయ్. కానీ ఈ మధ్య ఏపీలో మీడియా వార్ డైరెక్ట్గా సాగుతోంది. సందర్భం ఏదైనా సరే బురదజల్లడానికేనన్నట్టుగా ఆ మీడియా కాలుదువ్వుతోంది. జనం ఏమనుకుంటున్నారు… నవ్విపోదురు అన్న సోయ కూడా వారికి ఉండటం లేదు.
ఎల్లో మీడియాలో కన్పించని మూడ్ ఆఫ్ సర్వే వార్త
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని చానెళ్లు, రెండు పత్రికల గురించి అదే పనిగా చెబుతూ వస్తున్నారు. ఇదంతా పాత చింతకాయ పచ్చడే గానీ… ఇప్పుడో సందర్భం వచ్చింది. ఇండియా టుడే గ్రూప్… మూడ్ ఆఫ్ ద సర్వే విడుదల చేసింది. అందులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి పాపులారిటీ వచ్చింది. దేశం మొత్తంలో బెస్ట్ సీఎం ఎవరంటూ చేసిన సర్వేలో సీఎం జగన్మోహన్ రెడ్డికి 11 శాతం మద్దతు లభించింది. యూపీ సీఎం యోగి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తర్వాత జగన్మోహన్ రెడ్డికే ఆదరణ లభించిందన్నది సారాంశం. మొత్తంగా టాప్ 3లో జగన్మోహన్ రెడ్డి నిలిస్తే ఆ మీడియాకు మాత్రం ఆ వార్త కన్పించలేదంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఆశ్చర్యాన్ని కలిగించింది.
నాడు నేడు చంద్రజపమే
వాస్తవానికి ఈ వార్త ఆ రెండు పత్రికల్లో కన్పిస్తుందేమో చూశాం. కానీ కన్పించలేదు. మొత్తంగా అర్థమయ్యింది… ఆ రెండు పత్రికలు కేవలం నెగిటివ్ వార్తలను మాత్రమే పట్టించుకుంటున్నట్టుగా కన్పిస్తోంది. మిగతా వార్తలకు అక్కడ ప్రాధాన్యత లేదన్నది రోజు రోజుకు రుజవవుతోంది. ఓవైపు మీడియా బక్కచిక్క చస్తోంది. మరోవైపు జర్నలిస్టుల జీవితాలు ఆగమాగమవుతంటే… ఆ మీడియాకు మాత్రం వారి ఆలోచనలు, ఆ పార్టీ మాత్రమే ఎజెండాగా మారింది. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా ప్రతిపక్షనేత వార్త ఆ పత్రికల్లో కన్పించిందా అంటే అసలే లేదు. కనీసం బాక్స్ ఐటెమ్ గా వచ్చిన సందర్భాలు చాలా తక్కువే. ఇప్పుడు మాత్రం రోజూ చంద్రబాబు ప్రెస్ మీట్లతో పేజీలు పేజీలు నింపేస్తున్నారు. చంద్రబాబు చెప్పే మాటల్లో ఒకటీ రెండు కూడా కొత్త అంశాలుండవ్. కానీ వారికి అవే అమృతవాఖ్యాలుగా కన్పిస్తుంటాయ్.
నాడు జగన్ను తొక్కేసిన ఆ మీడియా
చంద్రబాబు ఐదేళ్ల పాలన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్త మచ్చుకైనా కన్పించేది కాదు. నెగిటివ్ వార్తయితే మాత్రం ప్రముఖంగా వచ్చేది. ఆయన కార్యక్రమాల గురించి అసలు వార్తలే కన్పించేవి కావు… మొదటి పేజీలో ఆయన ఎప్పుడూ కూడా కన్పించేవాడు కాదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు ఒక జాతీయ మీడియాలో పాపులర్ బ్రాండ్ ఒక రేటింగ్ ఇచ్చింది. అందులో మంచీ, చెడు విశ్లేషించవచ్చు కదా… అందుకే కాబోలు… వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు ఓ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. మన సీఎంకి టాప్ ర్యాంక్ వస్తే … పచ్చ మీడియాకి కనిపించదు… అదే బాబు గారికి వందో ర్యాంక్ వచ్చినా ఫ్రంట్ పేజీలు పగిలిపోయేయి. ఈ మాటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు… ఏమంటారు. ఏదైనా అతి అనర్థదాయకమే… నాడు కేసీఆర్ను ఆ మీడియానే పర్ఫెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మీడియానే జగన్మోహన్ రెడ్డిని మిస్టర్ పర్ఫెక్ట్ గా మార్చేయాలనుకుంటున్నట్టు కన్పిస్తోంది.
జగన్ సర్కార్ వర్సెస్ ఆ మీడియా
ఏపీలో ఇప్పుడో యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం వర్సెస్ ఆ మీడియా… ఆ మీడియా గతంలో అంతగా పబ్లిక్గా వార్తలను వడ్డించేది కాదు. నాడు వైఎస్ పాలనలోనైనా, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనైనా, ఆ తర్వాత కేసీఆర్ వ్యవహారంలోనైనా… తొలుత కొంత ఊపు చూపించినా… ఆ తర్వాత యజ్ఞంతో అంతా చల్లబడ్డాయ్. కానీ ఈ మధ్య ఏపీలో మీడియా వార్ డైరెక్ట్గా సాగుతోంది. సందర్భం ఏదైనా సరే బురదజల్లడానికేనన్నట్టుగా ఆ మీడియా కాలుదువ్వుతోంది. జనం ఏమనుకుంటున్నారు… నవ్విపోదురు అన్న సోయ కూడా వారికి ఉండటం లేదు.
ఆ మీడియాలో కన్పించని మూడ్ ఆఫ్ సర్వే వార్త
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని చానెళ్లు, రెండు పత్రికల గురించి అదే పనిగా చెబుతూ వస్తున్నారు. ఇదంతా పాత చింతకాయ పచ్చడే గానీ… ఇప్పుడో సందర్భం వచ్చింది. ఇండియా టుడే గ్రూప్… మూడ్ ఆఫ్ ద సర్వే విడుదల చేసింది. అందులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి పాపులారిటీ వచ్చింది. దేశం మొత్తంలో బెస్ట్ సీఎం ఎవరంటూ చేసిన సర్వేలో సీఎం జగన్మోహన్ రెడ్డికి 11 శాతం మద్దతు లభించింది. యూపీ సీఎం యోగి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తర్వాత జగన్మోహన్ రెడ్డికే ఆదరణ లభించిందన్నది సారాంశం. మొత్తంగా టాప్ 3లో జగన్మోహన్ రెడ్డి నిలిస్తే ఆ మీడియాకు మాత్రం ఆ వార్త కన్పించలేదంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఆశ్చర్యాన్ని కలిగించింది.
నాడు నేడు చంద్రజపమే
వాస్తవానికి ఈ వార్త ఆ రెండు పత్రికల్లో కన్పిస్తుందేమో చూశాం. కానీ కన్పించలేదు. మొత్తంగా అర్థమయ్యింది… ఆ రెండు పత్రికలు కేవలం నెగిటివ్ వార్తలను మాత్రమే పట్టించుకుంటున్నట్టుగా కన్పిస్తోంది. మిగతా వార్తలకు అక్కడ ప్రాధాన్యత లేదన్నది రోజు రోజుకు రుజవవుతోంది. ఓవైపు మీడియా బక్కచిక్క చస్తోంది. మరోవైపు జర్నలిస్టుల జీవితాలు ఆగమాగమవుతంటే… ఆ మీడియాకు మాత్రం వారి ఆలోచనలు, ఆ పార్టీ మాత్రమే ఎజెండాగా మారింది. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా ప్రతిపక్షనేత వార్త ఆ పత్రికల్లో కన్పించిందా అంటే అసలే లేదు. కనీసం బాక్స్ ఐటెమ్ గా వచ్చిన సందర్భాలు చాలా తక్కువే. ఇప్పుడు మాత్రం రోజూ చంద్రబాబు ప్రెస్ మీట్లతో పేజీలు పేజీలు నింపేస్తున్నారు. చంద్రబాబు చెప్పే మాటల్లో ఒకటీ రెండు కూడా కొత్త అంశాలుండవ్. కానీ వారికి అవే అమృతవాఖ్యాలుగా కన్పిస్తుంటాయ్.
నాడు జగన్ను తొక్కేసిన ఆ మీడియా
చంద్రబాబు ఐదేళ్ల పాలన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్త మచ్చుకైనా కన్పించేది కాదు. నెగిటివ్ వార్తయితే మాత్రం ప్రముఖంగా వచ్చేది. ఆయన కార్యక్రమాల గురించి అసలు వార్తలే కన్పించేవి కావు… మొదటి పేజీలో ఆయన ఎప్పుడూ కూడా కన్పించేవాడు కాదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు ఒక జాతీయ మీడియాలో పాపులర్ బ్రాండ్ ఒక రేటింగ్ ఇచ్చింది. అందులో మంచీ, చెడు విశ్లేషించవచ్చు కదా… అందుకే కాబోలు… వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు ఓ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. మన సీఎంకి టాప్ ర్యాంక్ వస్తే
… పచ్చ మీడియాకి కనిపించదు… అదే బాబు గారికి వందో ర్యాంక్ వచ్చినా ఫ్రంట్ పేజీలు పగిలిపోయేయి. ఈ మాటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు… ఏమంటారు. ఏదైనా అతి అనర్థదాయకమే… నాడు కేసీఆర్ను ఆ మీడియానే పర్ఫెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మీడియానే జగన్మోహన్ రెడ్డిని మిస్టర్ పర్ఫెక్ట్ గా మార్చేయాలనుకుంటున్నట్టు కన్పిస్తోంది.