Breaking: బ్యాంకు ఖాతాదారులు ఇక కంగారు పడాల్సిన అవసరంలేదు. మీరు కేవైసీ పూర్తి చేయలేదా? అయితే మీకు RBI ఓ వెసులుబాటు కల్పించింది. కొన్ని రోజుల క్రితం మనం చూశాం.. జనవరి 1 నుంచి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా లేని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని RBI ప్రకటించింది. విషయం తెలిసినవారు కేవైసీ పూర్తి చేసారు. తెలియనివారు ఇంకా ఆ పని పూర్తి చేయలేదు. అయితే తాజాగా RBI ఈ డేట్ ని పొడిగిస్తూ ఉత్తర్వులు జరీ చేసింది.
కస్టమర్ల కేవైసీ వివరాలను క్రమం తప్పకుండా నిర్ణీత కాల వ్యవధిలో అప్డేట్ చేస్తూ ఉంటాయి సదరు సంస్థలు. ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ ఇలా రకరకాల డాక్యుమెంట్లను అప్డేట్ చేస్తుంటాయి. ఈ విధంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తుంటాయి. అందుకే కేవైసీ అనేది చాలా ముఖ్యమైనది. ఇకపోతే ప్రస్తుతం కరోనా వేరియంట్ ఒమీక్రాన్ ఎక్కువగా ప్రబలడంతో ఈ వెసులుబాటు RBI కల్పించింది.