మద్యం అనేక కుటుంబాలలో చిచ్చు రేపుతోంది. ప్రభుత్వాలు ఎంత కట్టడి చేయాలని చూసినా గాని దానికి బానిస అయిన వాళ్ళు మాత్రం తమ ఆరోగ్యాన్ని ప్రమాదకరం లోకి నెటుకుంటూనే మరోపక్క ఇతరులకు కూడా ప్రమాదకరంగా మారుతున్నారు. చాలా క్రూరంగా రాక్ష తత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగానే బిడ్డల ముందు తల్లిని తండ్రి మద్యం మత్తులో హీటర్తో గొడ్డును బాదినట్లు బాది చంపేశాడు. బాలింత అని చూడకుండా ఆ తాగుబోతు భర్త కొట్టిన దెబ్బలకు బాలింత అయినా భార్య అక్కడికక్కడే మృతి చెందటం హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని ఇందిరానగర్లో నివసించే రుడావత్ అనిల్(31) వికారాబాద్ జిల్లాకు చెందిన అనిత(29) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి నలుగురు పిల్లలు. సినిమా సెట్టింగులు, వేదికల అలంకరణ సామగ్రి అద్దెకిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా నెలన్నర క్రితం మరో బాబు పుట్టాడు. గత కొంతకాలంగా అనిల్ వరకట్న వేధింపులు వేధిస్తూ అనితా ని పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలని చిత్ర బాధలకు గురి చేసిన టైములో 2 సంవత్సరాల క్రితం ఈవిడ కేసు పెట్టడం జరిగింది. అయితే ఇటీవల శనివారం పూట ఫుల్ గా తాగి వచ్చి అనిల్ నిద్రపోతున్న అనిత ని బాలింత అని చూడకుండా చావ బాదడం జరిగింది.
తల్లిని కోడుతుండటంతో పిల్లలలో పెద్ద కూతురు ‘వద్దు నాన్నా… అమ్మని కొట్టవద్దని’ గట్టి గట్టిగా కేకలు వేసిన పిల్లలను పక్కకు గెంటేసి ఆ బాలింతను హీటర్తో బలంగా కొట్టడంతో అనితా అక్కడికక్కడ ప్రాణాలు విడిచింది. దీంతో ముగ్గురు పిల్లల తల్లి చనిపోవడంతో పిల్లలు ఏం చేయలేని స్థితి లోకి వెళ్ళిపోయారు. ఈ ఘటనను చూసిన చుట్టుప్రక్కల స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. భార్య చనిపోవడంతో నిందితుడు అనిల్ పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.