ఆరోగ్యంగా ఉండటానికి మీరు డాక్టర్ ను సంప్రదించే ఉంటారు. డాక్టర్ మిమ్మల్ని ఎక్కువ నీరు తాగమనే చెప్పి ఉంటారు. అలా చెప్పారు కదా అని ఎక్కువ చల్లని నీరు తాగుతున్నారా?? అయితే మీరే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారు అవుతారు. చల్లని నీరు తాగటం వల్ల ఆరోగ్యం క్షిణిస్తుందని, లేని సమస్యలను పుట్టుకొస్తాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ చల్లని నీరు శరీరాన్ని పాడు చేయటంతో పాటు కొత్త రోగాలను సృష్టిస్తుంది. అయితే ఇలాంటి సమస్యలు రాకూడదు అంటే గోరు వెచ్చని నీరు కానీ, రూం టెంపరేచర్ లో ఉన్న నీరు కానీ తాగాలి. అవే మంచివి.
గోరు వెచ్చని నీరు తాగటం వల్ల రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడటంతో పాటు శరీరాన్ని డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే ఒక రోజుకి మహిళలు సగటున 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్ల వరకు నీరుని తీసుకోవటం చాలా మంచింది. ఈ నీరును ఎలా పడితే అలా తాగకూడదు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవటానికి ముందు రెండు గ్లాసుల నీరుని గుటకలు వేస్తూ తాగాలి.
ఇలా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యలు, డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి గోరు వెచ్చని నీరు ఎంతో మేలు చేస్తుంది. తిన్న ఆహారం కూడా తొందరగా జీర్ణమవుతుంది. మలబద్దకం వంటి సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి. రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ నీరు మంచి ఫలితాలనిస్తుంది. అధిక బరువు వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. జలుబు, దగ్గు, పడిశంతో సతమతమవుతున్న వారికి ఉపశమనం ఇస్తుంది.