మధుమేహ వ్యాధి వచ్చిన తర్వాత నాలుగయిదు సంవత్సరాల లోపు బరువు తగ్గిన పక్షంలో మధుమేహం లక్షణాలు పూర్తిగా లేకుండా పోవడం కానీ, బాగా తగ్గడం కానీ జరిగే అవకాశం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. అయితే మధుమేహం వచ్చిన తర్వాత నాలుగయిదు ఏళ్ల లోపే ఇది జరగాలి.
శరీరంలోకి వెళ్లిన చక్కెరలను సవ్యంగా ప్రాసెస్ చేయలేని స్థితిని మధుమేహం అంటారు. ఈ ప్రాసెసింగ్ను నియంత్రించే ఇన్సులిన్ అనే ఎంజైమ్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల మధుమేహం తలెత్తుతుంది. మధుమేహం వచ్చిన వారికి సాధారణంగా వైద్యులు మందులు ఇస్తారు. దానికి తోడు ఆహారం అలవాట్లు మార్చుకోవాలని చెబుతారు. వ్యాయామం చేయాలని చెబుతారు.
ఒక వ్యాధి లక్షణాలు దాదాపు మాయం అయినా, లేక చాలవరకూ తగ్గినా దానిని రెమిషన్ అంటారు. మధుమేహం ఉన్న వారు బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే రెమిషన్ రావచ్చు. తిండి విపరీతంగా తగ్గించిన (రోజుకు 624 నుంచి 700 కిలోకాలరీల వరకూ )సందర్భాలలో కూడా రెమిషన్ వచ్చినట్లు ఒక అధ్యయనంలో తేలింది.
అంత విపరీతంగా కాకుండా ఆహారం కాస్త తగ్గించి కూడా రెమిషన్ పొందవచ్చా అని ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో పరిశీలించారు. మధుమేహం వచ్చిన తర్వాత అయిదేళ్ల లోపు కనీసం పది శాతం బరువు తగ్గిన వారు అసలు బరువు తగ్గనివారితో పోల్చుకుంటే రెమిషన్ పొందే అవకాశం రెట్టింపు ఉన్నట్లు తేలింది.
బరువు తగ్గడం వల్ల రెమిషన్ సాధించే రేటు తక్కువే అయినప్పటికీ మధుమేహం నియంత్రణలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో దీనిని బట్టి తెలుస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.