వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి.వాతావరణాన్ని బట్టి ముఖ్యంగా మారేది మొహం, చర్మం రంగు. ఈ శీతాకాలంలో చలికి మొహం పగిలి పోవడమే కాకుండా అందవికారంగా మారుతుంది. కొందరు ఏకంగా మొహం ముడతలు పడి వయసు మళ్ళిన వాళ్ళలా కనిపిస్తారు. అలా అవడానికి వాతావరణంలో మార్పులు ఒక కారణం కాగా మరోకటి తీసుకునే ఆహరం కూడా మన శరీర సౌందర్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ చలికాలంలో మొహం కాంతి వంతంగా కనపడాలంటే ఈ ఆహారపు అలవాట్లు చేపట్టండి.
శరీరం సౌందర్యంగా కనపడాలంటే తృణ ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాటిలో ఎలాంటి కొలెస్టాల్ శాతం ఉండదు. తృణ ధాన్యాలలో ముఖ్యంగా సజ్జలు రాగులు చర్మం కాంతివంతంగా మారడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ధాన్యాలను పొడిగా చేసి జావలాగా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే కాకుండా కావలసిన పోషకాలు మాత్రమే అంది చర్మం తాజాగా ఉంటుంది. వీటితోపాటు తేమ శాతం ఎక్కువగా ఉన్న సొరకాయలు, కీరదోస, బీర, గుమ్మడి, లాంటి కూరగాయలు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారే అవకాశం ఉంటది. అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ చేసిన ఆహారం తీసుకోండి. అవి స్కిన్ పై మంచి ప్రభావాన్ని చూపుతాయి.
మొహం తాజాగా ఉండాలంటే డార్క్ చాక్లెట్స్ తినండి. అవి చర్మాన్ని నున్నగా మారుస్తాయి. మరో టిప్ నిద్రను నిర్లక్యం చేయకూడదు. నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల మొహం అందవీహినంగా తయారవుతది. రోజు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా మొహంలో నిగారింపు వస్తది. వీటితోపాటు బార్లీ వాటర్ తీసుకున్న, గ్రీన్ టీ, ఓట్ మిల్క్ తాగిన చర్మం సౌదర్యంగా మారుతుంది. టామాటో రసాన్ని మొహానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడుక్కోవాలి. దానిమ్మ, ఆప్రికాట్ పండ్లు తీసుకోవడం ద్వారా చర్మంపై ముడతలు పడడం తగ్గుతాయి.