నెయ్యి తినడం వల్ల అందరు నష్టాలే జరుగుతాయి అనుకుంటారు కానీ రోజు వారి ఆహారంలో నెయ్యిని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతే ఈ చలికాలంలో నెయ్యి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు నెయ్యి తినడం వల్ల గుండెకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతదని మెడికల్ గా నిరూపించబడింది. రోజు నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
స్వచ్ఛమైన నెయ్యిని రోజు రెండు నుండి మూడు టీ స్పూన్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా నెయ్యి రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల శీతాకాలంలో వచ్చే ప్రధాన సమస్యలైనా జలుబు, దగ్గు వంటి సమస్యలు దరి చేరవు. అంతేకాదు శరీరానికి కూడా కావలసిన ఖనిజాలు అందుతాయి. అంతేకాదు నెయ్యిలో ఉండే ప్రోటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందించి నీరసాన్ని దరిచేరకుండా చేస్తుంది. కొందరికి నెయ్యి విపరీతంగా బరువుపెరుగుతారు అనే ఆలోచన ఉంటది. అది కేవలం అపోహ మాత్రమే. నెయ్యి మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరిగే సమస్య ఉండదని పైగా శరీరంలోని చేదు కోల్ట్రాల్ ను తొలగించి బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
నెయ్యిలోని కొవ్వు, ఒమేగా ఆమ్లాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి ఒక సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మం, పెదవులు కోల్పోయిన తేమను పునరుద్ధరించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతే కాదు మీరు ప్రతిరోజు కొద్దిగా నెయ్యితో నీరు కలపి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం తాజాగా ఉండడంతో పాటు ముడతలు దరిచేయనివ్వదు. కొందరు జట్టులోని చుండ్రు సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. అలంటి సమస్యలు ఉన్న వారు నెయ్యిని గోరువెచ్చగా వేడిచేసి వారో లో రెండు సార్లు మర్దన చేయడం ద్వారా చుండ్రు సమస్య తొలగడమేకాకుండా జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. నెయ్యిలో ప్రధానంగా లభించే విటమిన్ ‘ఎ’ కంటికి ఎంతో మేలు మేలు చేస్తుంది.