Ghee: నెయ్యి బెల్లం రెండింటిలోనూ ఔషధ గుణాలున్న సంగతి తెలిసిందే.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. పాల నుండి నెయ్యి తయారవుతుంది.. చెరుకు నుండి బెల్లం తయారవుతుంది.. సహజ సిద్ధంగా తయారయ్యే ఈ రెండు పదార్థాలను కలిపి భోజనం తర్వాత తీసుకుంటే.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
ఒక చెంచా నెయ్యిలో ఒక చెంచా బెల్లం పొడి లేదంటే చిన్న బెల్లం ముక్కను వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండింటినీ కలిపినా తినాలి.. అదే బెల్లం ముక్కను నేతిలో నానబెట్టి ఐదు నిమిషాల పాటు చప్పరిస్తూ తినాలి.. ఇలా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీసుకుంటే శరీరం నిర్విషికరణకు సహాయపడుతుంది. అంతేకాకుండా మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఐరన్ , మెగ్నీషియం, పొటాషియం తో పాటు విటమిన్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. నెయ్యిలో కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది..
నెయ్యి బెల్లం కలిపి తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. శరీరాన్ని డిటాక్స్ ఫై చేస్తుంది. శరీరంలో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది రక్తశీలత సమస్యలు తగ్గిస్తుంది ఈ మిశ్రమాన్ని మధ్యాహ్నం భోజనం తర్వాతే కాకుండా రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉన్న సమయంలో బెల్లం , నెయ్యి కలిపిన మిశ్రమం తీసుకోండి..