మనిషి జీవితం లో నిద్ర అనేది చాల ముఖ్యమైనది. ప్రతి మనిషి తప్పకుండ 8 గంటలు పాటు నిద్రపోవడం వలన చురుకుగా ఆరోగ్యం గా ఉండడానికి ఉపయోగపడుతుంది.
రాత్రి పూట ఎన్నిగంటలు నిద్రపోయినా కూడా మధ్యాహ్నం కొద్ది సేపైనా నిద్రపోకుండా కొందరు అస్సలు ఉండలేరు. మధ్యాహ్నం భోజనం తర్వాత వారికి పిలిచినట్టుగా నిద్ర వచ్చేస్తుంది. అయితే.. ఈ పగటి నిద్రవల్ల చాలా బద్ధకంగా తయారౌతారని కొందరు చెబుతుంటారు. పగటి నిద్ర పనికి రాదు అనికూడా అంటారు. కానీ.. బద్ధకం మాట పక్కన పెడితే.. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోతే.. వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుందట.
కనీసం అరగంట నుంచి గంటపాటు నిద్రపోతే.. పిల్లలతోపాటు.. పెద్దలకు కూడా చాలా మంచిదని చెబుతున్నారు.దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు పూర్తి చేసేస్తారు.. అలా భోజనం పూర్తి అయ్యాక రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయం అంటున్నారు నిపుణులు. ఇటీవల నిపుణులు చేసిన ఓ సర్వేలో.. మధ్యాహ్నం గంట నిద్రపోయేవారు శారీరకం గానూ, మానసికం గాను ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిసిందంట.
అదేవిధంగా మధ్యాహ్నం నిద్రపోని వారిపై కూడా పరిశోధనలు చేశారట. నిద్రపోయే వారిని.. నిద్ర పోని వారిని పోల్చి చుస్తే.. నిద్రపోని వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాట్టుగా తేలింది. మధ్యాహ్నం నిద్రపోయే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉందని చెబుతున్నారు.
చిన్నారులకైతే మధ్యాహ్నం నిద్ర చాలా అవసరమని చెబుతున్నారు. మధ్యాహ్నం నిద్ర వారిలో మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుందట. తెలివితేటలు బాగా పెరుగుతాయని చెబుతున్నారు.ఐతే ఈ మధ్య కొన్ని స్కూల్స్ లో 5 ఏళ్ళ లోపు పిల్లలకు భోజనం తర్వాత నిద్రపోయే ఏర్పాటు చేస్తున్నారు..కానీ కొన్ని స్కూల్స్ లో ఆ సమయం పిల్లలకు ఇవ్వడం లేదట.దానివల్ల వాళ్ళు అనేకరకాల ఇబ్బందులకు గురవుతున్నట్టు నిపుణులు తెలిపారు.