మనిషి మనుగడ సాఫిగా జరగలంటే ప్రతిరోజు భోజనం తప్పనిసరిగా తినాలిసిందే. ఎందుకంటే జీవించడానికి ఆహారం తప్పనిసరి. తినే ఆహారం కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి.మరి తినే ఆహారం ఎలా ఉండాలో అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఆహారం తేలికగా జీర్ణమయ్యేది అయి ఉండాలి.అలాగే తినే ఆహారం కూడా ఋతువుల ప్రకారం తీసుకోవాలి. తినే ఆహారం పరిశుభ్రమయినదిగా ఉండాలి. అంతేకాకుండా ప్రకృతి సహజంగా పండించిన ఆహారాన్నే తినాలి. రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినకూడదు.
ఆహారం తినే ముందు జాగ్రత్తలు :
కాయగూరలు ,ఆకుకూరలు,పండ్లను మంచి నీటిలో కడిగిన తరవాతనే తినాలి.వీలయితే ఉప్పు వేసి రెండు మూడు సార్లు కడిగితే దాని మీద ఉన్న ఫంగస్ ,బ్యాక్టీరియా,పురుగు మందుల అవశేషాలు కొంత వరకయినా పోతాయి.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ కాలం నిలువ ఉంచిన ఆహారాన్ని తినరాదు.చెడు వాసన వచ్చే ఆహారాన్ని అసలే తినరాదుఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినాలి ,బీర , తృణ ధాన్యాలు ,మొలకెత్తిన విత్తనాలు , పండ్లు , ఆకు కూరలు , చిలగడదుంప వంటివాటిని తింటూ ఉండాలి.
తినే ఆహారం ఎలా ఉండాలంటే?
ఆహారాన్ని ఎప్పుడు కూడా మన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తింటూ ఉండాలి.మధుమేహం ఉన్నవాళ్లు పంచదార కలిగిన పదార్థాలను తినకపోవడం,గుండె సమస్యలు ఉన్నవాళ్లు బాదాం లాంటి పదార్థాలు తినడం వంటివి చేయాలి. అలాగే రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా ఉన్నా ఆహార పదార్ధాలను తినాలి. తినేటప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి , నెమ్మదిగా తినాలి అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తినే టప్పుడు మాట్లాడరాదు ,మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి.తినే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి.