విటమిన్ డీ కావల్సినంత లేకపోతే మగవారిలో కొలరెక్టలకాన్సర్, ఆడవారిలో బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. విటమిన్ డీ డెఫిషియెన్సీ వల్ల చిన్న పిల్లల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పెద్దవారిలో ఎముకలు మెత్తబడిపోతాయి. విటమిన్ డీ లభించే ఆహార పదార్ధాలు గురించి తెలుసుకుందాం. సాల్మన్, ట్యూన ఫిష్ లాంటి చేపల్లో విటమిన్ డీ ఉంటుంది. దాంతో పాటూ వీటిలో ఉండే కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల ఇవి తీసుకుంటే మీ డైట్ న్యూట్రియెంట్ రిచ్ గా తయారౌతుంది.
పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్, బటర్, పన్నీర్…అన్నింటిలోనూ విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటూ ఎగ్స్ కూడా చాలా మంచివి. అయితే ఎగ్స్ని యోక్ తో సహా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డీ ఉండేది ఎగ్ యోక్లోనే.
మష్రూమ్స్లో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువ. విటమిన్ డీ కూడా ఎక్కువే. వీటిని పైగా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. పీజా, పాస్తా, ఫ్రైడ్ రైస్, సాండ్విచ్, ఆమ్లెట్, స్టర్-ఫ్రైడ్ వెజ్జీస్…
గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ డీ లభిస్తుంది. అయితే వీటిని ప్రాసెస్ చెయ్యకుండా తీసుకోవాలి.
విటమిన్ డీ ముఖ్యంగా ఎముకలని కాపాడుతుంది . ఎముకలకి కావాల్సిన కాల్షియం అందాలంటే శరీరంలో అవసరమైనంత విటమిన్ డీ ఉండాలి. విటమిన్ డీ లేకపోతే శరీరానికి కావాల్సినంత కాల్షియం అందదు. దాంతో, ఎముకలు, పళ్ళూ బలహీనపడతాయి. మిగిలిన అన్ని విటమిన్స్ ఆహారం ద్వారా అందితే, విటమిన్ డీ కి మెయిన్ సోర్స్ సూర్య కాంతి. అది కుదరని వారు ఆహారం ద్వారా కూడా విటమిన్ డీ ని తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సూర్య కాంతి ద్వారా విటమిన్ డీ అందే అవకాశం ఎక్కువగా లేదు. ఒక పక్క మాన్సూన్, సూర్యుడు ఒక్కోరోజు అసలు కనిపించడం లేదు. ఇంకో పక్క కరోనా వైరస్, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు విటమిన్ డీ డెఫిషియెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.