Water: ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగమని నిత్యం వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఈ వేడి నీళ్లలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగేవాళ్ళు మనలో చాలా మందే ఉన్నారు.. అదే వేడి నీటిలో కొద్దిగా ధనియాలు వేసి కాసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..
మసాలా దినుసులలో ధనియాల కు ప్రత్యేక స్థానం ఉంది భారతీయ వంటకాలలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ధనియాల లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంది. ఇందులో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక వ్యాధులను నయం చేయడంలో దోహదపడతాయి.
ఉదయాన్నే ధనియాల నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది ధనియాల లో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ప్రతిరోజు ధనియాల నీటిని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ నీరు ప్రతిరోజూ తాగండి బరువు తగ్గడం ఖాయం. డయాబెటిస్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహం ఉన్న వారు ప్రతిరోజు ఈ నీటిని తాగితే త్వరగా షుగర్ అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇంకా పరగడుపున ఈ నీరు త్రాగటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది . జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇంకా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలకుండా, చిట్లిపోకుండా ఉంటుంది.