కొన్నేండ్ల క్రితం వంటపాత్రలుగా రాగితో చేసిన వాటిని అధికంగా ఉపయోగించేవారు. ఎందుకంటే రాగి పాత్రల్లో వంట చేసుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని మన పెద్దలు చెప్పేవారు . ఇప్పటికీ పలువురి ఇండ్లల్లో రాగి పాత్రలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఇటీవల సైతం పలు పరిశోధనలు.. రాగికి సహజ సిద్దంగానే నీటిని శుద్ధి చేసి.. అందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లను తరిమికొట్టే గుణం ఉంటుందని తెలిపాయి. దీనికి తోడు రాగి పాత్రల్లో నిలువ చేసిన నీరు తాగటంతో అనేక ఆరోగ్య కరమైన లాభాలు ఉన్నాయనీ, కరోనాను సైతం తరిమికొట్టవచ్చునని పలువురు పరిశోధకులు సైతం స్పష్టం చేశారు. మరీ అలాంటి రాగి పాత్రలతో కలిగే పలు ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. !
రాగి పాత్రల్లో నిలువ చేసిన నీరు తాగటం వల్ల జీవ క్రియలు సంక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా రాగికి ఉంటే పలు సహజమైన లక్షణాల కారణంగా.. పొట్టలోపల ఇన్ప్లమేషన్ను రెడ్యూస్ చేసి హానికరమైన బ్యాక్టిరియాను చంపడంతో పాటు స్టమక్ను శుభ్రం చేసి.. లివర్, కిడ్నీ పని సామర్ధ్యంపై ప్రభావం పడకుండా చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు దరిచేరవు. బరువును త్వరగా తగ్గించడంలోనూ రాగిపాత్రలో నిల్వ చేసిన నీరు దోహద పడుతుంది. ఎందుకంటే శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలలో రాగి ఒకటి. వీటిల్లో నిల్వ చేసిన నీరు తాగడంతో శరీరానికి తగినంతగా అంది.. అనవసర కొవ్వును శరీరంలో ఉండకుండా కాపాడుతుంది.
రాగి లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన రాగి త్వరగా గాయాలను మాన్పుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రాగి పాత్రలో నీటిని రెగ్యులర్ గా తాగుతూ ఉంటే ముఖం మీద ఫైన్ లైన్స్ రావు. రాగి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా రాగి తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ను సరైన విధంగా ఉంచుతుంది. అలాగే, క్యాన్సర్ ప్రభావాన్ని సైతం రాగి పాత్రల్లో నీరు తీసుకోవడం ద్వారా కొద్దిమేర తగ్గించుకోవచ్చు.
ఇన్ఫెక్షన్సను దూరం చేయడంలోనూ రాగి ప్రభావవంతంగా ఉంటుంది. ప్రత్యేకంగా నీటిలో ఉండే ఈ.కోలీ వంటి బ్యాక్టిరియాను నిర్మూలించడంలో ముందుంటుంది. అలాగే, థైరాయిడ్ గ్రంధికి సంబంధించిన సమస్యలను దూరం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. శరీర చర్మ సౌందర్యానికి సైతం రాగి చాలా కీలకం. రాగి పాత్రల్లో నీరు తీసుకోవడం ద్వారా కిళ్లనొప్పులకు సంబంధిత రోగాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.