Foot: శరీరంలోని పలు అవయవాలకు అనుసంధానమయ్యే నాడులు పాదాల్లో ఉంటాయి.. అందువలన పాదాలకు మసాజ్ చేస్తే ఆయా అవయవాలు యాక్టవ్ అవుతాయి.. అయితే పాదంలో ఎక్కడ ఏ భాగం ఉంటుందో.. ఎక్కడ మసాజ్ చేస్తే ఏ నొప్పిని నయం చేసుకోవచ్చో.. పాదంలో ఎక్కడ మసాజ్ చేస్తే ఏ అవయవం రిలాక్స్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!
దృష్టి సమస్యలతో బాధపడుతున్నవారు పాదంలో రెండు, మూడవ వేళ్ళకు కాళి దిగువున ఉన్న ప్రాంతానికి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల కంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. కంటి సమస్యలు తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు పాదాల చివర్లలో కాలి వేళ్ళ పై, పాదం వెనుక భాగంలో మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి పరార్. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు పాదంలోని అడుగుల బంతుల మధ్య ప్రాంతంలో మసాజ్ చేయాలి. తలనొప్పి ఈ సమస్యతో బాధపడే వారు రెండు కాళ్ల బొటన వ్రేలుకు మసాజ్ చేయాలి. వెళ్ళను కొంత సేపు ఒత్తి పట్టుకుని విడిచిపెట్టాలి. దీన్నే స్క్వీజ్ అండ్ రిలీజ్ టెక్నిక్ అంటారు. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది.
పాదాలకు ఆయిల్ రాసుకుని మొత్తంగా మసాజ్ చేస్తే వెన్నెముక కలిపి నాడులు అనుసంధానమై వెన్నుకి శక్తిని అందిస్తుంది. వెన్ను నొప్పులను తగ్గిస్తుంది. వెన్నెముక ను బలంగా తయారయ్యేలా చేస్తుంది. పాదం బొటనవేలు కింద ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేయడం వల్ల మెడభాగంలో నొప్పులు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు పాదాలను మసాజ్ చేసుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.