సీతాఫలం, రామా ఫలం మాదిరిగానే లక్ష్మణ ఫలం కూడా.. ప్రకృతి మానవుడికి ప్రసాదించిన అద్భుతమైన ఫలాలలో ఇది కూడా ఒకటి.. లక్ష్మణ ఫలం పోషకాలతో కూడిన రుచికరమైన పండు.. ఒక్కసారి ఈ ఫలం లోని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!
లక్ష్మణ ఫలం లో కాల్షియం, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, ధయామిన్ , రైబోఫ్లేవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషక విలువలతో నిండి ఉంది.. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.. ఈ పండుని నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకొని తీసుకోవడం మంచిది.. లక్ష్మణ ఫలం ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ పండు తినటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొటెస్ట్ క్యాన్సర్, శ్వాస క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్ ఇలా 12 రకాల క్యాన్సర్ ను నివారించే లక్షణాలు ఈ పండులో సమృద్ధిగా ఉన్నాయి.. ఇటీవల జరిగిన పరిశోధనలలో పెద్ద ప్రేగు క్యాన్సర్ ను నయం చేయడంలో ఉపయోగించే కీమోతెరపి కన్నా.. పదివేల రేట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలరని పరిశోధకులు చెబుతున్నారు..
ఈ పండు తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మూత్రశయ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఈ ఫలం అద్భుతమైన వరం. నిద్రలేమి సమస్య తో బాధపడుతున్న వారు తరచూ ఈ పండుని తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. టెన్షన్, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాలను కరిగించి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది..