ఈ కాలంలో చాలా మంది షుగర్ వ్యాది బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి వస్తే మాత్రం జీవితాంతం మందులు వాడాలిసిందె.రక్తంలో చక్కెర పరిమాణం పెరిగడం వలన షుగర్ వ్యాధి వస్తుంది.అయితే షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడానికి మందులతో పాటుగా కొన్ని రకాల చిట్కాలు వాడితే ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే షుగర్ వ్యాధి నివారణకు ఆమ్లా టీ చక్కగా ఉపయోగపడుతుంది.ఉసిరితో చేసిన టీ తాగితే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.మరి ఈ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.₹
ఉసిరి టీ :
Read more: Health Tips: నేరేడు జ్యూస్ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 2 కప్పుల నీళ్లను తీసుకోవాలి.ఇప్పుడు ఇందులో ఒక చెంచా ఉసిరి పొడి, కొద్దిగా అల్లం ముక్కలను వేయాలి.అలాగే మూడు లేదా నాలుగు తాజా పుదీనా ఆకులు వేసి కొన్ని నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత టీని వడ గొట్టి ఒక కప్పులో పోసుకుని తాగాలి.ఇలా తయారుచేసిన ఉసిరి టీను రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Read more: శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇలా చేయండి..!
ఉసిరి షుగర్ వాళ్లకు ఎలాంటి మేలు చేస్తుందంటే..?
Read more: Pomegranate: రాత్రి సమయంలో ఈ పండు తీసుకుంటే ఇక ట్యాబ్లెట్ అవసరం ఉండదు..
ఉసిరిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి కావున ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఉసిరిలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వ్యాధి గ్రస్తులకు చాలా చక్కగా పని చేస్తుంది. టీ అనే కాకుండా వీటిని పచ్చిగా తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది