రాగిపాత్రల్లో వండినప్పుడు, లేదా వండినవి నిలువ చేసినప్పుడు కొన్ని పదార్థాలు నెగటివ్ రియాక్షన్ ని ఇస్తాయి. పాలు వెన్న, ను రాగి పాత్రలోనిల్వచేసినప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఉన్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ఊరగాయలు, పచ్చళ్లను రాగి వాటిలో నిల్వ చేయడం అసలు మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పులుపు వలన రాగి తో ప్రతిచర్య జరిగి అది తిన్నప్పుడు ఆరోగ్యానికి హాని కలగవచ్చు. ఇంకా చెప్పాలంటే రాగి మన శరీరంలోకి చేరడం వలన అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలు వస్తాయి . పొట్టలో గ్యాస్, వాంతులు, విరేచనాలు తిమ్మిరి లాంటివి రావడానికి కారణం అవుతాయి.కానీ రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది.
శరీర లోపలి భాగాలలో ,ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లు మానే విధం గా చేయడానికి రాగి ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే వచ్చే వృద్ధాప్య ఛాయలు రాకుండా రక్షణ కల్పిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడి ,రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేయటానికి రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం అవసరం. క్యాన్సర్ ముప్పును కూడా ఇదిఅడ్డుకుంటుంది.