Rice Cooker: ఈ రోజుల్లో వేడినీళ్ల దగ్గర్నుంచి, తాగే నీరు , తినే తిండి కూడా ఇప్పుడు కరెంట్ ద్వారా తయారవుతున్నాయి. తాగే నీరు కూడా వాటర్ హీటర్లో వేడి చేసుకుంటున్నారు. అలాగే, అన్నం రైస్ కుక్కర్లోనే వండేస్తున్నారు. ఇవన్నీ కలిపి మనుషుల ఆరోగ్యానికి హానికరం గా తయారయ్యాయి . రైస్ కుక్కర్లో వండుకున్న అన్నం విషం తో సమానమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, రైస్ కుక్కర్ లో అన్ని అల్యూమినియం తో తయారయినవే ఉంటాయి. అల్యూమినియం పాత్రలలో వంట చేయడం, చేసిన వంట ను వాటిలో నిల్వ చేయడం అసలు మంచిది కాదు.
ఆహారం ఉడికేటప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. ఇలా తగలక పోతే వండిన ఆహారం విషంగా తయారవుతుంది. ఈ విషాలలో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి తక్షణమే పనిచేస్తుంది. దీన్ని ఫుడ్ పాయిజన్ అని అంటారు.రెండవది శరీరంలోకి చేరిన కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విష ప్రభావం బయట పడుతుంది. ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ రైస్ కుక్కర్లో అన్నం వండుతున్నప్పుడు గాలి వెళ్లే అవకాశం అసలు ఉండదు . దీంతో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారం తినటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది తెలుసుకుందాం.
గుండె సంబంధిత జబ్బులు
ఉదర సంబంధ సమస్యలు
అధిక బరువు
నడుము నొప్పి
కీళ్ల వాతం
షుగరు
గ్యాస్ సమస్యలు
వంటి రోగాల బారిన పడతారు అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు .కొంచెం ఓపికతో బియ్యం కడిగి పెట్టుకుని వండుకోవటం ఉత్తమం అని అంటున్నారు. వండటం త్వరగా పూర్తి అవడం కన్నా… ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అని గుర్తు చేస్తున్నారు.