మనిషికి ఆహారం ఎంతో అవసరం .. అలాగే తీసుకునే ఆహారం తో పాటు తినే వేళలు మీద కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మరీ ముఖ్యం గా రాత్రిపూట ఆహారపు అలవాట్లు సక్రమం గా లేనట్లయితే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. రాత్రి నిద్రకు రెండు గంటల ముందు భోజనం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు . ఎందుకంటే ఈ అలవాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది . జీర్ణక్రియ సక్రమం గా పనిచేస్తే అది బరువును నియంత్రణలో ఉంచుతుంది. అధిక బరువు పెరగకుండా చూస్తుంది.
రాత్రితీసుకునే భోజనం త్వరగా జీర్ణం కాదు. కాబట్టి.. మనం రాత్రిపూట ఎక్కువగా తింటే, చాల ఆరోగ్య సమస్యలు వస్తాయి .. దానివల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే రాత్రి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము . రాత్రిపూట త్వరగా అరిగిపోయే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలు తీసుకుంటే.. అవి త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి రాత్రిపూట వీలయినంత తక్కువ పరిమాణంలో తినడం చాలా మంచిది. భోజనంలో ఎక్కువగా బీన్స్, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.
అల్లం లాంటి మసాలాలను తక్కువ మొత్తంలోవాడాలి.పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనంపూర్తి చేయాలి .రాత్రి 8 గంటలకు ముందే భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఒకవేళ… పడుకునే ముందు మళ్లీ ఆకలిగా అనిపిస్తే, ఏదైనా పండు తినొచ్చు. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, పాస్తా, బర్గర్స్, పిజ్జా, బిర్యానీ, రైస్, ఫ్యాటీ చికెన్, మటన్, సోడా, వేయించిన బంగాళాదుంపలు, చిప్స్, చిల్లిలోస్, స్వీట్స్ మరియు చాక్లెట్ రాత్రిపూట తినడం మానేయాలి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు .