పాలు ఒక సంపూర్ణ, సమతుల్య పోషకాహారం. అన్ని పోషకాలను మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది కండరాల, ఎముకల ఆరోగ్యాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం ను అత్యంత సమృద్ధిగా కలిగినది. భారత ప్రజల్లో ఉన్న ప్రగాఢ నమ్మకం ప్రకారం దేశంలోని పల్లె ప్రజలు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు అంటే కల్తీ లేని స్వచ్ఛమైన పాలు తీసుకోవడం వల్ల. కాబట్టి ఇది అధిక పోషకాలతో కూడిన ఆరోగ్య సహాయక సూక్ష్మజీవుల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇందులో ఉన్న విటమిన్ A కళ్ళ ఆరోగ్యానికి శ్రీరామరక్ష వంటిది. శరీరం మంచి ఆరోగ్య కరమైన పేగులు కలిగి ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యానికి ఇవి ఉపయోగపడతాయి.
పురాతన కాలం నుండి మానవ జీవనంలో భోజనం యొక్క ముఖ్యమైన భాగాలలో పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, జున్ను వంటి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల మందికి పైగానే వినియోగిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాలను పొందడం చాలా కష్టంగా ఉంది. సాధారణంగా నీరు లేదా ఇతర పదార్ధాలను కలిపి అమ్ముతున్నారు ఇప్పుడు. ఈ చర్యల వలన వీటి నాణ్యతను తగ్గిస్తున్నాయి.
ప్యాకెట్ లో లభించే పాలు పాశ్చరైజేషన్ చేయబడి ఉంటాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను వేడి చేసి చల్లార్చి ఆ తరువాత ప్యాకెట్లలో నింపుతారు. ఈ ప్రక్రియ ద్వారా పాలలోని వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయి. అందువల్ల ప్యాకెట్ పాలు కొనేటప్పుడు మనకు కావలసిన వెన్న శాతం ఉన్న వాటిని ఎంచుకోవాలి. పెద్ద కంపెనీ బ్రాండ్ ల నుండి దొరికే ప్యాకెట్లు కల్తీ అయ్యే అవకాశం చాలా తక్కువ. విడిగా దొరికే పాలల్లో నీళ్లు కలపడం, మరో విధంగా కల్తీ చేసే అవకాశం ఎక్కువ. విడిగా పాలను కొనేటప్పుడు అవి తీసిన సమయం నుండి గంటల లోపు మీకు అందే విధంగా ఉంటే మంచిది. ఇది విడిగా తీసుకున్న పాలను తప్పనిసరిగా ఒక్కసారైనా కాసిన తరువాతే వాడాలి. పాలు ప్యాకెట్ లో కొన్నా విడిగా కొన్నా వాటి పోషక విలువలు లో మాత్రం పెద్దగా తేడాలు ఉండవు.