అరటిపండ్లు,ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికి అందుబాటులో ఉండే ఈ పండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అరటిపండ్లు తినడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి.
అరటి పండులో పొటాషియం అధికంగా ఉండడం వలన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కండర బలోపేతానికీ పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు కలిగిస్తుంది. ఇది సహజ యాంటాసిడ్ గా పనిచేస్తుంది. కడుపులో మంట ఉంటే, బాగా పండిన ఒక అరటి పండు తింటే తగ్గుతుంది. అరటి పండును భోజనం తర్వాత తీసుకోవడం చాలా మంది చేసే పని. కానీ, రాత్రి భోజనం తర్వాత మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడడానికి, జలుబుకు దారితీస్తుంది. అందుకే దీన్ని రాత్రుళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. దానికి బదులు మధ్యాహ్న సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే, ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అసౌకర్యానికి కారణమవుతుంది. అదేవిధంగా, అరటి పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి.
ఈ పండ్లల్లో పొటాషియం కంటే సోడియం తక్కువ ఉంటుంది. ఇది రక్తపోటు ఉన్నవారికి చాలా మంచిది. పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు, మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ పండును కచ్చితంగా నెలరోజులు తింటే, ఇందులోని ఫైబర్ ఆ సమస్యని దూరం చేస్తుంది. అదే విధంగా,కొంతమంది ఖాళీ కడుపుతో పరగడుపునే ఈ పండుని తింటారు. ఇది కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయని, ఆ తర్వాత వెంటనే అలసటగా ఉంటుందని చెబుతున్నారు. అరటిలో పిండి పదార్థం ఎక్కువ. బరువును కంట్రోల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సరిపడా బరువు ఉండేలా చేస్తుంది. అరటిలోని పీచు పదార్థం మరింత ఆకలి వెయ్యకుండా చేస్తుంది. కాబట్టి అరటిపండు తినేటప్పుడు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.