ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు.
గంగిగోవు పాలు గరిటేడైనా చాలు అన్న నానుడి ప్రకారం ఆవుపాలు అమ్మ పాలలాగ ఎంతో శ్రేష్టమైనవి, ఇతర జంతువుల పాలకంటే ఆరోగ్యకరమైనవి.
ఆవుపాలలో ” కాసినోజిన్ ” మరియు “లాక్టాల్ అల్బుమిన్ ” అను మాంసకృత్తులు ఉన్నాయి . పాలలో ఉన్న మాంసకృత్తులు శరీరంలో లోపించిన సందర్భాలలో అవి భర్తీ చేయబడును.
ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులు చిన్నపిల్లలకు , గర్భిణీ స్త్రీలకు , పాలిచ్చు బాలింతలకు , జీర్ణశక్తి లోపించిన ,వారికి , శస్త్రచికిత్స చేయించుకున్న వారికి అత్యంత అవసరం. క్షయ , మధుమేహం , క్యాన్సర్ , ఉబ్బసం , నిద్రలేమి , నరాల బలహీనత లాంటి దీర్ఘకాల వ్యాదులలో ఆవుపాల యందు ఉన్న మాంసకృత్తులు దివ్యౌషధంలా ఉపయోగపపడతాయి .
పాలలో ఉండు కొవ్వు మన శరీరంలో తేలికగా జీర్ణం అగును.కొవ్వు తీసిన పాలను ” స్కీమ్డ్ మిల్క్ ” అంటారు. పాలలో ఖనిజ లవణాలతో పాటు సిట్రిక్ ఆసిడ్ కూడా క్యాల్షియం , మెగ్నిషియంలలో మిళితమై పుష్కలంగా ఉంటుంది.
ఈ ఆసిడ్ కడుపులో కురుపులు రాకుండా ఆపడంలో ప్రముఖపాత్ర వహించును.ఆవుపాలతో పాటు 2 ఖర్జురాలు కలిపి సేవిస్తుంటే ఐరన్ , క్యాల్షియం , ఫాస్ఫరస్ వంటి మినరల్స్ మరియు సాల్ట్ మన శరీరానికి పుష్కలముగా లభించును.. ఆవు పాలను రోజూ పిల్లలకు తాగిస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుల్లో బాగా రాణిస్తారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎందులోనైనా ఉత్సాహంగా పాల్గొంటారు.ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కనుక ఇవి అధిక బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయి. డైట్ ప్లాన్లో ఉన్నవారు ఆవుపాలను నిరభ్యంతరంగా తాగవచ్చు.