పనస కాయాల కనిపించే ఈ పండు పేరు ‘డురియన్’. పనస పండులా ఉంది కదా, సువాసనలు వెదజల్లుతుందేమో అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పండు. థాయిలాండ్, మలేషియా తదితర ప్రాంతాల్లో వీటిని పండిస్తున్నారు.దీని వాసన బాగోకపోయినా రుచి మాత్రం చాలా బాగుంది, అని కొందరు అంటే మరికొందరు రుచి అంత ఏమి బాగోదని ఎవ్వరి అనుభవం వారుచెప్తారు. అంతేకాదు..కార్బోహైడ్రేట్స్ కలిగిన ఈ పండు తింటే బోలెండ శక్తి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. డురియన్లో విటమిన్ B6 సమృద్ధిగా ఉంటుంది.
డురియన్ పండు దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది.ఈ ఫలాన్ని తినేవారు నిత్య యవ్వనంగా ఉంటారని నమ్ముతారు. ఒత్తిడి, కుంగుబాటు సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. డురియన్ లో ఉండే విటమిన్-C వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. రక్తహీనత రోగులకు డురియన్ పండు చాలా మంచిది. జీర్ణక్రియ, బ్లడ్ షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, లైంగిక సమస్యలతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఫ్రూట్. చూశారుగా, ఈ పండులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇంతకీ ఈ పండు ధర ఎంతో తెలుసా? 990 డాలర్లు. అంటే రూ.71 వేలు. ప్రజలు ఈ పండు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. కంపే ఇంపంటూ తమ ఆస్తులు అమ్మేసి మరీ కొనేస్తున్నారు. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఇండియాలో ఈ పండ్లను కొనేవారి సంఖ్య తక్కువ. అందుకే, మనకు ఈ పండ్లు పెద్దగా లభించవు.
ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, ప్రజలు దీని ధరను సైతం పట్టించుకోకుండా తినేస్తున్నారు. అయినప్పటికీ ఈ పండు అత్యంత అరుదుగా దొరుకుతుంది కాబట్టే ఇంత ధర చెల్లిస్తున్నారని చెప్తున్నారు.