భూమిలో లభ్యమయ్యే దుంపలు మితంగా తీసుకుంటే అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యంగా బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, క్యారెట్లుతో పాటు పలు రకాల వీటిలో కార్బోహైడ్రేట్స్, పిండిపదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఇవి మంచివే కానీ ఎక్కువ మోతాదులో తింటే కాళ్ళు, చేతుల నరాలు పట్టేసి నొప్పిపెడుతుంటాయి. వంటల్లో కాకుండా బంగాళాదుంపలను జ్యూస్ లాగ తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను కలిగిస్తది. ముందుగా బంగాళాదుంపల జ్యూస్ తాయారు చేయు విధానం తెలుసుకుందాం.
రెండు మంచి పరిమాణంలో ఉన్న బంగాళాదుంపలు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు నుండి మూడు గ్లాసుల నీరు ఆముక్కలతో కలుపుకొని మిక్సర్ జార్ లో వేసి 2 నుండి 3 నిమిషాలు జ్యూస్ లాగా పట్టుకోవాలి. ఇది వడగట్టి తాగవచ్చు లేదా మీకు ఇష్టమైన పండ్ల రసం లేదా కూరగాయల రసంతో కలుపుకుని తగవచ్చు. ఎలా తాగడం వల్ల అనేక రకాల పోషకాలు మీ శరీరానికి అందుతాయి. ఈ రసంతో ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులోని ఆమ్లతను తగ్గించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయని, కడుపులోని ఇతర సమస్యలను తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచడమే కాకుండా కాలాల మార్పులతో వచ్చే ఇన్ఫెక్షన్లను శరీరంలోకి రాకుండ చేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా వ్యర్థ రసాయాల నుండి జీర్ణవ్యవస్థను కాపాడుతుంది.
భోజనం తరువాత అర కప్పు బంగాళాదుంప రసం తాగడం ద్వారా అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబందించిన సమస్యలను తొలగిస్తుంది. నీరసంగా ఉన్న వ్యక్తులకు ఈ రసంలో ఉండే సహజ చక్కెర కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ శక్తి ఉత్పత్తికి చాలా సహాయపడతాయి. ఇందులో ఉండే ‘సి’ విటమిన్ వల్ల దెబ్బలు తగిలిన వారు ఈ రసం తాగడం వల్ల అవి త్వరగా మానిపోతాయి అంతే కాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ అయ్యేలా చూస్తాయి. దినివల్ల చర్మం కోమలంగా తయారు అవుతుంది అంతే కాదు వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. కాబట్టి శరీరం, చర్మ ఆరోగ్యం కోసం బంగాళాదుంప రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి.