మనం తినే పండ్ల లో అరటిపండు కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తరచుగా అరటిపండ్లు తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అనడం లో ఆశ్చర్యం లేదు. అరటిపండు చాల పోషకాల ను కలిగి ఉంటుంది.తక్షణ శక్తి ని ఇచ్చేపండు ఇది. ప్రదానం గా తీసుకున్న ఆహారం అరగక ఇబ్బంది పడే వారు అరటి పండ్ల ను తింటూ ఉంటే… జీర్ణక్రియ బాగా పని చేస్తుంది.
కొంతమంది హైపర్ టెన్షన్ సమస్య తో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు అరటిపండు ను తినడం వలన ఆ సమస్యను తేలికగా పరిష్కరించుకోగలుగుతారు.ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం పరిష్కారాన్ని చూపిస్తుంది.అరటిపండు లో సహజమైన యాంటీ-యాసిడ్ ఉంటుంది. ఇది పొట్టలో సమస్యలను అడ్డుకుంటుంది. అలాగే అరటి లో ని చెక్కెర శరీరానికి బలాన్నికలిగిస్తుంది. ఈ పండు లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకానికి కూడా ఇది మంచి ఔషధం అనే చెప్పాలి .అయితే అరటి పండు ఎంత మంచి దై నా కూడా రాత్రివేళ మాత్రం దీన్ని తినకుండా ఉండడం మంచిది అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, అరటికి శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంటుంది.
అందువల్ల అప్పటికే చల్లగా ఉన్న శరీరాన్ని అరటిపండు మరింత చల్ల బరిచి జలుబు,దగ్గురావడానికి కారణం అవుతుంది. అందువల్ల రాత్రిళ్లు తప్ప, రోజంతటీలో ఈ పండును ఎప్పుడైనా తినవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.పెద్ద అరటిపండ్లు జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.అందువల్ల పడుకునే సమయానికి 2 లేదా 3 గంటల ముందే ఈ పండును తినేయాలి. తప్ప పడుకునే కొద్దీ సమయం ముందు తినకుండా ఉండడమే మంచిది. జలుబు, దగ్గు తో బాధ పడేవారు అరటి పండ్ల ను తింటే అవి మరింత ఎక్కువవుతాయి. రాత్రి వేళ అరటిపండ్లు తినడం తగ్గించాలి. రాత్రివేళ జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది. అందువల్ల రాత్రిళ్లుఅరటి పండు తింటే,అది వెంటనే జీర్ణం కాదు. తద్వారా నిద్ర పట్టకుండా సమస్యగా మారుతుంది.