ప్రస్తుత కాలంలో అధిక ఒత్తిడికి గురయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తదితర కారణాల వలన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.. అయితే ఈ సమస్య నుంచి గట్టేక్కాలంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు పాటించమని మానసిక వైద్యులు చెబుతున్నారు..
అధిక టెన్షన్ కు గురవుతున్న సమయంలో మంచి ఆహారం కూడా ఎంతో సహాయపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారి ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా చేరుస్తుంది. శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. విటమిన్స్, మినరల్స్, మంచి పోషకాలు ఉన్న సంపూర్ణ పోషక ఆహారాన్ని తీసుకోవాలి.. ఏదైనా ఒకే విషయాన్ని ఎక్కువసార్లు ఆలోచించకూడదు. పదేపదే ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని మీ మనసుని వేరే ఆలోచనల వైపు పనుల వైపు మళ్లించడం మంచిది..
మీరు చేసే పనిలో మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి.. ఒత్తిడిని జయించాలి అంటే కంటి నిండా నిద్రపోవాలి. రాత్రిపూట త్వరగా నిద్రపోతే ఉదయం త్వరగా లెగుస్తారు. దాంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రతిరోజు ఉదయం లేచాక కాసేపు వ్యాయామం చేయడం మంచిది. ఒత్తిడి తగ్గడానికి వ్యాయామం వాకింగ్, రన్నింగ్ తప్పకుండా చేయాలి. ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది..