Food: వండిన ఆహారం కూడా కలుషితం అయ్యే అవకాశం చాలా ఉంది . సరైన భద్రత తో నిల్వ చేసుకోక పొతే .. ఫుడ్ పాయిజన్ జరిగి వికారానికి కారణం అవుతుంది అని భారతదేశం యొక్క ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తెలియజేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపిన దాని ప్రకారం వండుకున్న ఆహారం నిల్వ చేసుకోవడం పట్ల చాలా జాగ్రత్త లు తీసుకోవాలి. దీనికోసం చేయవలసినది ఏమిటంటే,
రెండు గంటల లోపు వండిన ఆహారాన్ని 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
వంట చేసుకునే పాత్రలు శుభ్రం గా లేకపోతే అందులో వండిన ఆహారం కలుషితం అవుతుంది.
ఆహారం వడ్డించుకునే వస్తువులు శుభ్రంగా లేనప్పుడు కూడా ఆహారం కలుషితం అవుతుంది.
డయేరియా, డీహైడ్రేషన్, వాంతులు వంటి సమస్యలు ఫుడ్ పాయిజన్ వల్ల రావడం జరుగుతుంది .
ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
వంట చేసే ముందు,ఆహారం తినే ముందు చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. హోటల్ లో దొరికే ఆహారం కి ఇలా జాగ్రత్త చేయరు కాబట్టి వాటిని తినకుండా ఉండడం మంచిది.
వంట చేసిన తర్వాత , ఆహారం పై మూత సరిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
వంట చేయడం అయిపోయిన తర్వాత స్టవ్,అక్కడ ఉండే గట్టు అన్ని శుభ్రంగా కడగాలి.
పచ్చి కూరగాయల వండకుండా తినడం తగ్గించాలి. వీటి వలన బ్యాక్టీరియా శరీరంలో కి చేరతాయి.
బాగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. మార్కెట్ నుండి తీసుకువచ్చిన కూరగాయల లో కాలీఫ్లవర్ పాలకూర, బ్రకోలీ, ఉంటే వాటిని ఉప్పు వేసిన నీటిలో శుభ్రం చేస్తే అన్ని విధాలా మంచిది. ఆహార విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు .