Black Pepper: పోపుల పెట్టె లో ఉండే వస్తువులలో మిరియాలు కూడా ఒకటి.. ఇవి రుచికి ఘాటైన ఆరోగ్యానికి మేలు చేసేవే..!! మిరియాల పొడిలో లో కొద్దిగా తేనె కలుపుకుని ఆ మిశ్రమాన్ని తింటే.. శరీరంలో జరిగే అద్భుతం ఏంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా తీసుకుంటారు..!! ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏమిటంటే..!?
చలికాలంలో దగ్గు, జలుబు కామన్.. ఈ సమస్య తరచుగా వేధిస్తుంటే రాత్రి పడుకునే ముందు అర టీ స్పూన్ మిరియాల పొడిలో ఒక స్పూన్ తేనె కలపాలి. నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే త్వరగా శరీరంలో ఉన్న శ్లేష్మం కరిగిపోతుంది. దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది . గొంతు నొప్పి, గొంతులో గరగర ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ సీజన్ లో వచ్చే అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
Read More: Breaking: బండి సంజయ్కి 14 రోజులు రిమాండ్..
తేనె లో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నుంచి బయటపడవచ్చు. అన్ని రకాల ఉదర సమస్యలకు ఈ మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. ఇంకా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ తో బాధపడుతున్న వారు ఒక్కసారి ఈ మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే చక్కటి రిలీఫ్ పొందవచ్చు.
Read More:YSRCP: జగన్ అది పెద్ద నిర్ణయం..? 30 మంది ఎమ్మెల్యేల్లో గుబులు..!!