అన్నం తింటే దానిలో ఉండే షుగర్ కారణంగా, బరువు పెరుగుతారని డాక్టర్లు అంటుంటారు . మూడు పూట లా అన్నం తినకూడదని అంటుంటారు. అమెరికా జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లోచేసిన పరిశోధన లో కొత్త విషయం తెలిసింది. రోజువారీ తినే అన్నం పాలిష్ పట్టిన తెలుపు రంగు బియ్యం తో వండుకుని మూడు పూటల లేదా రెండు పూటలూ తినడం వలన బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ గా ఉంది.
అదే బ్రౌన్ రైస్ తింటే మాత్రం బరువు పెరగక పోగా తగ్గుతారని పరిశోధన లో తేలింది..బియ్యం తెల్లగా మారడానికి వాటిని రిఫైండ్ చేస్తారు. పాలిష్ చేస్తారు. ఈ ప్రక్రియ లో ఆ బియ్యం తమలో ఉండే సహజ సిద్ధమైన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని గుణాలను కోల్పోతాయి. అదే, బ్రౌన్ రైస్ అయితే పాలిష్ చేయకుండా, వరి నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ జరగకుండా ఉండడం వలన వాటిలో పోషకాలు మనకు అందుతాయి. పాలిష్ చెయ్యని బ్రౌన్ రైస్లో షుగర్ పాళ్లు తక్కువగా ఉన్నట్లు పరిశోధన లో తేలింది. ఈ రైస్ తినేవాళ్లకు ఎక్కువ కేలరీలుశరీరానికిఅందక పోవడంవలన బరువు తగ్గుతారు.
ఈ రైస్ తింటే బరువు ఖచ్చితంగా తగ్గుతారు..ఈ బియ్యం తో బరువు తగ్గడానికి కారణం వీటిలో లభించే పోషకాలు శరీర మెటబాలిజంను క్రమబద్ధీకరిస్తాయి.అంటే శరీరం లో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ కొవ్వు ఉంటేకరిగిపోయేలా చేస్తాయి. కొవ్వు తక్కువ ఉంటేపెంచుతాయి. న్యూట్రీషనిస్టుల లెక్క ప్రకారం బ్రౌన్ రైస్ తింటూ,బరువు తగ్గించుకునే వ్యాయామాల వంటివి చేస్తూ ఉంటే రెండు వారాల్లో 5 కేజీల దాకా బరువు తగ్గుతారు. ఈబియ్యం ధర కాస్త ఎక్కువే అయినా కూడా దాని ప్రయోజనాలు కూడా అందుకు తగ్గట్టే పొందుతాము.